సంక్రాంతి రేసులో అజిత్, ధనుష్‌ చిత్రాలు

ABN , First Publish Date - 2021-10-27T00:31:21+05:30 IST

దీపావళి పోటీ నుంచి అగ్రహీరో అజిత్‌ నటించిన ‘వలిమై’ చిత్రం తప్పుకుంది. రష్యాలో జరిగిన క్లైమాక్స్‌ షూట్‌ జాప్యం కావడంతో దీపావళికి రిలీజ్‌ చేయలేకపోయారు. దీంతో సంక్రాంతికి విడుదల చేయాలని నిర్మాత బోనీకపూర్‌ ప్లాన్‌ చేశారు. ‘నెర్కొండ పార్వై’ చిత్రం తర్వాత

సంక్రాంతి రేసులో అజిత్, ధనుష్‌ చిత్రాలు

దీపావళి పోటీ నుంచి అగ్రహీరో అజిత్‌ నటించిన ‘వలిమై’ చిత్రం తప్పుకుంది. రష్యాలో జరిగిన క్లైమాక్స్‌ షూట్‌ జాప్యం కావడంతో దీపావళికి రిలీజ్‌ చేయలేకపోయారు. దీంతో సంక్రాంతికి విడుదల చేయాలని నిర్మాత బోనీకపూర్‌ ప్లాన్‌ చేశారు. ‘నెర్కొండ పార్వై’ చిత్రం తర్వాత హీరో అజిత్‌- దర్శకుడు హెచ్‌.వినోద్‌ కాంబినేషన్‌లో రానున్న ‘వలిమై’లో హీరోయిన్‌గా హ్యూమా ఖురేషీ నటిస్తుంటే, యువన్‌ శంకర్‌ రాజా సంగీతం సమకూర్చారు. టాలీవుడ్‌ యంగ్‌ నటుడు కార్తికేయ ప్రతి నాయకుడి పాత్రలో నటించారు. సంక్రాంతికి ‘వలిమై’ విడుదల కావడం ఖాయమని కోలీవుడ్ ఫిక్సయింది.


అయితే, నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ దర్శకత్వంలో హీరో విజయ్‌ - హీరోయిన్‌ పూజా హెగ్డే జంటగా నటిస్తున్న చిత్రం ‘బీస్ట్‌’ కూడా సంక్రాంతికి విడుదల కావొచ్చన్న సంకేతాలు వస్తున్నాయి. కానీ, ఈ చిత్ర విడుదలపై స్పష్టత లేదు. అదేసమయంలో మరో హీరో ధనుష్‌, మాళవికా మోహనన్‌ జంటగా నటిస్తూ కార్తీక్‌ నరేన్‌ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘మారన్‌’ సంక్రాంతికి విడుదల చేసేలా ప్లాన్‌ చేసినట్టు సమాచారం. ఈ వార్తలు నిజమైతే సంక్రాంతికి ‘వలిమై’, ‘మారన్‌’ చిత్రాల మధ్య గట్టి పోటీ నెలకొననుంది. 

Updated Date - 2021-10-27T00:31:21+05:30 IST