సరికొత్త వెబ్ సిరీస్కు ‘ఆహా’ శ్రీకారం.. టైటిల్ ఇదే!
ABN , First Publish Date - 2021-08-03T01:10:09+05:30 IST
రాజమండ్రిలో జరిగే కథ. తెలుగు నెటివిటీకి తగినట్లు దీన్ని రూపొందిస్తున్నారు. గోదావరి, దాని చుట్టు పక్కల ప్రాంతాల్లోని జీవనాన్ని తెలియజేస్తుంది. కృష్ణ అలియాస్ కిట్టు అనే యువకుడు చుట్టూ తిరిగే కథ. కిట్టు తల్లిదండ్రులైన శంకర్, గౌరి ఓ కోచింగ్ సెంటర్ను
హండ్రెడ్ పర్సెంట్ తెలుగు ఓటీటీ ఫ్లాట్ఫామ్ ‘ఆహా’.. ‘తరగతి గది దాటి’ అనే సరికొత్త వెబ్ సిరీస్ను చేయబోతున్నట్లు ప్రకటించింది. సెంటర్ ఫ్రెష్ సమర్పణలో రాబోతున్న ఈ వెబ్ సిరీస్ టి.వి.ఎఫ్ ఒరిజినల్ ‘ఫ్లేమ్స్’కు రీమేక్. టీనేజ్ రొమాన్స్ గురించి తెలియజేసే వెబ్ సిరీస్ ఇది. ‘పెళ్లిగోల’ అనే వెబ్ సిరీస్ చేసిన దర్శకుడు మల్లిక్ రామ్ ఈ సిరీస్ను తెరకెక్కించనున్నారు. హర్షిత్ రెడ్డి, పాయల్ రాధాకృష్ణ, నిఖిల్ దేవాదుల ప్రధాన పాత్రల్లో నటించనున్నారు. దీనికి సంబంధించిన ఫస్ట్ పోస్టర్ను ఆహా విడుదల చేసింది. ఈ పోస్టర్ ఆసక్తికరంగా ఉంది.
‘తరగతి గది దాటి’ రాజమండ్రిలో జరిగే కథ. తెలుగు నెటివిటీకి తగినట్లు దీన్ని రూపొందిస్తున్నారు. గోదావరి, దాని చుట్టు పక్కల ప్రాంతాల్లోని జీవనాన్ని తెలియజేస్తుంది. కృష్ణ అలియాస్ కిట్టు అనే యువకుడు చుట్టూ తిరిగే కథ. కిట్టు తల్లిదండ్రులైన శంకర్, గౌరి ఓ కోచింగ్ సెంటర్ను నడుపుతుంటారు. కృష్ణకు లెక్కలంటే చాలా ఇష్టం. విద్యార్థిగా మంచి తెలివితేటలుంటాయి. కానీ చదువుపై దృష్టి పెట్టడు. వాళ్ల కోచింగ్ సెంటర్లో జాస్మిన్ అనే అమ్మాయి జాయిన్ అయిన తర్వాత అతని ప్రపంచం ఎలాంటి మలుపులు తిరుగుతుందనేదే కథ. ఐదు ఎపిసోడ్స్ ఉండే ఈ సుదీర్ఘమైన వెబ్ సిరీస్లో కృష్ణ, జాస్మిన్ మధ్య ప్రేమ.. టీనేజ్ గందరగోళాలెలా ఉంటాయనేది ఆసక్తికరంగా తెరకెక్కించబోతున్నట్లుగా ‘ఆహా’ ప్రకటించింది.