Nandivarman: చోళుల ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ చూశారు.. ఇప్పుడు పల్లవుల కథతో!

ABN , First Publish Date - 2022-10-16T03:03:30+05:30 IST

చోళ సామ్రాజ్యం, చోళుల వీర ధీరత్వాన్ని చాటిచెప్పిన చిత్రం ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ (ponniyin selvan). ఇపుడు పల్లవుల పోరాట పటిమ, పాలన విధానాన్ని..

Nandivarman: చోళుల ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ చూశారు.. ఇప్పుడు పల్లవుల కథతో!

చోళ సామ్రాజ్యం, చోళుల వీర ధీరత్వాన్ని చాటిచెప్పిన చిత్రం ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ (ponniyin selvan). ఇపుడు పల్లవుల పోరాట పటిమ, పాలన విధానాన్ని తెలియజేసేందుకు ‘నందివర్మన్‌’ (Nandivarman) చిత్రం సిద్ధమైంది. ఏకే ఫిల్మ్‌ ఫ్యాక్టరీ బ్యానరుపై జీవీ పెరుమాళ్‌ వర్థన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా టీజర్‌‌ను తాజాగా విడుదల చేశారు. ఈ చిత్రంలో సురేష్‌ రవి, ఆషా గౌడ హీరోహీరోయిన్లుగా నటించారు. సినిమా గురించి దర్శకుడు మాట్లాడుతూ... ‘సెంజి కోట రాజధానిగా పల్లవులు సామ్రాజ్యాన్ని వారి వైభవాన్ని చాటిచెప్పే విధంగా నందివర్మన్‌ ఉంటుంది. దాదాపు వెయ్యేళ్ళ కిత్రం నాటి వారి సామ్రాజ్యాన్ని కళ్ళకు కట్టేలే త్రీడి యానిమేషన్స్‌ విజువల్స్‌ను ఇందులో తీసుకొచ్చాం. పురావస్తు శాఖ బృందం సెంజికోట రహస్యాలను గుర్తించానికి వెళ్ళగా, పల్లవుల కథను బహిర్గతం చేసేలా ఈ చిత్రం కథ సాగుతుంది. ‘పీఎస్‌’ (PS) కంటే ముందే ఈ సినిమా ప్రారంభించాం. కరోనా, వరదలు వంటి ప్రకృతి వైపరీత్యాల వల్ల షూటింగ్‌ పూర్తి చేయడం ఆలస్యమైంది. త్వరలోనే మీ ముందుకు పల్లవులు రాబోతున్నారు, చూసి ఆదరించండి’’ అని కోరారు. 


ఇక మణిరత్నం కలల ప్రాజెక్ట్ అయిన ‘పొన్నియిన్ సెల్వన్’ కోలీవుడ్‌లో రికార్డులు క్రియేట్ చేస్తుంది. కలెక్షన్ల పరంగానూ ఇప్పటికే టాప్ ప్లేస్‌ని సొంతం చేసుకున్న ఈ చిత్రం.. ఈ సంవత్సరం విడుదలైన చిత్రాల రికార్డులన్నింటిని తిరగరాస్తూ ఇండస్ట్రీ హిట్ దిశగా దూసుకెళుతోంది. ఈ సినిమాలో విక్రమ్, ఐశ్వర్యారాయ్, కార్తి, జయం రవి, త్రిష, ప్రకాష్ రాజ్, శరత్ కుమార్ వంటి భారీ తారాగణం నటించిన విషయం తెలిసిందే.  ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ పార్ట్ 2 కోసం కోలీవుడ్ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. త్వరలోనే ఈ పార్ట్ విడుదలకు సంబంధించిన వివరాలను మణిరత్నం ప్రకటించనున్నారు.

Updated Date - 2022-10-16T03:03:30+05:30 IST