దుర్ఘటన జరిగిన 37ఏళ్లకు వెబ్ సిరీస్

ABN , First Publish Date - 2021-12-02T21:45:14+05:30 IST

బాలీవుడ్‌లో భారీ బడ్జెట్ సినిమాలను నిర్మించే సంస్థ యశ్‌రాజ్ ఫిలింస్. ఆ సంస్థ తొలి వెబ్ సిరీస్‌ను ప్రకటించింది

దుర్ఘటన జరిగిన 37ఏళ్లకు వెబ్ సిరీస్

బాలీవుడ్‌లో  భారీ బడ్జెట్ సినిమాలను నిర్మించే  సంస్థ యశ్‌రాజ్ ఫిలింస్. ఆ సంస్థ తొలి వెబ్ సిరీస్‌ను ప్రకటించింది. భోపాల్ గ్యాస్ ట్రాజెడీని ఆధారంగా చేసుకుని ఈ వెబ్ సిరీస్‌ను తెరకెక్కించబోతుంది. 


యశ్‌రాజ్ ఫిలింస్ ఎంటర్‌టైన్‌మెంట్ తొలి వెబ్ సిరీస్‌ను నిర్మించబోతుంది. ఆ వెబ్ సిరీస్ పేరు ‘‘ ద రైల్వే మేన్ ’’. శివ్ రావైల్ దర్శకత్వం వహించబోతున్నారు. ఆర్.మాధవన్, కేకే.మీనన్, దివ్యేందు శర్మ, ఇర్ఫాన్ ఖాన్ కొడుకైన బాబిల్ ఖాన్ నటించనున్నారు. 1984 డిసెంబర్ 2న భోపాల్ గ్యాస్ ట్రాజెడీ చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటనలో మిథైల్ ఐసో సైనేట్ అనే రసాయనం విడుదలయి వేలాదిమంది ప్రాణాలు కోల్పోయారు. సరిగ్గా ఘటన జరిగిన 37ఏళ్లకు యశ్‌రాజ్ ఫిలింస్ ఎంటర్‌టైన్‌మెంట్ వెబ్‌సిరీస్‌ను ప్రకటించడం విశేషం. ఈ వెబ్ సిరీస్ వచ్చే ఏడాది డిసెంబర్ 1 నుంచి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో ప్రసారం కానుంది.   

 

‘‘ భోపాల్ స్టేషన్‌లోని రైల్వే కార్మికులకు నివాళులుగా ఈ షోను నిర్మిస్తున్నాం.  భోపాల్ గ్యాస్ ట్రాజెడీతో అనేక మంది జీవితం ప్రభావితమైంది. యశ్ రాజ్ ఫిలింస్ తరపున మంచి కథలను అభిమానులకు చెప్పాలనుకుంటున్నాం. ఈ ఘటన జరిగి 37ఏళ్లైంది. అందుకే వారికి నివాళులుగా ఈ వెబ్‌సిరీస్‌ను నిర్మిస్తున్నాం. ఈ కథ ప్రతి ఒక్కరికి తెలియాలి’’  అని యశ్‌రాజ్ ఫిలింస్‌కు చెందిన ప్రతినిధులు చెబుతున్నారు.



Updated Date - 2021-12-02T21:45:14+05:30 IST