Adivi sesh: కోలుకుని ఇంటికి తిరిగొచ్చా
ABN , First Publish Date - 2021-09-27T21:23:59+05:30 IST
కొద్ది రోజుల క్రితం డెంగ్యూ జ్వరంతో ఆస్పత్రిలో చేరిన హీరో అడివి శేష్ కోలుకుని ఇంటికి తిరిగొచ్చారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ వేదికగా తెలిపారు. ‘ఇంటికి తిరిగి వచ్చాను. విశ్రాంతి తీసుకుంటూ కోలుకుంటున్నాను’’ అని ట్వీట్ చేశారు శేష్.
కొద్ది రోజుల క్రితం డెంగ్యూ జ్వరంతో ఆస్పత్రిలో చేరిన హీరో అడివి శేష్ కోలుకుని ఇంటికి తిరిగొచ్చారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ వేదికగా తెలిపారు. ‘ఇంటికి తిరిగి వచ్చాను. విశ్రాంతి తీసుకుంటూ కోలుకుంటున్నాను’’ అని ట్వీట్ చేశారు శేష్. డెంగ్యూ బారిన పడిన ఆయనకు రక్తంలో ప్లేట్లెట్స్ ఆకస్మాత్తుగా తగ్గిపోవడంతో ఈ నెల 18న హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు.
ప్రస్తుతం శేష్ ‘మేజర్’ సినిమాలో నటిస్తున్నారు. 26/11 ముంబై టెర్రర్ అటాక్లో అమరుడైన ఆర్మీ ఆఫీసర్ మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది. శశికిరణ్ తిక్క ఈ చిత్రానికి దర్శకుడు.