ఆదిపురుష్‌: ప్యాన్‌ ఇండియా కాదు.. ప్యాన్‌ వరల్డ్‌ సినిమా!

ABN , First Publish Date - 2022-01-28T18:16:30+05:30 IST

‘బాహుబలి’ తర్వాత దేశవ్యాప్తంగానే కాకుండా పలు దేశాల్లో కూడా ప్రభాస్‌కు ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ పెరిగింది. అక్కడ కూడా ఆయనకు మార్కెట్‌ ఏర్పడింది. ‘బాహుబలి’ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ఆదరణ పొందడంతో ప్రభాస్‌ చిత్రాలన్నీ ప్యాన్‌ ఇండియా స్థాయిలోనే తెరకెక్కుతున్నాయి. తాజాగా ఓంరౌత్‌ దర్శకత్వం వహిస్తున్న ‘ఆదిపురుష్‌’ చిత్రం కూడా 400 కోట్లకు పైగా బడ్జెట్‌తో భారీ స్థాయితో రూపొందుతుంది.

ఆదిపురుష్‌: ప్యాన్‌ ఇండియా కాదు.. ప్యాన్‌ వరల్డ్‌ సినిమా!

‘బాహుబలి’ తర్వాత దేశవ్యాప్తంగానే కాకుండా పలు దేశాల్లో కూడా ప్రభాస్‌కు ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ పెరిగింది. అక్కడ కూడా ఆయనకు మార్కెట్‌ ఏర్పడింది. ‘బాహుబలి’ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ఆదరణ పొందడంతో ప్రభాస్‌ చిత్రాలన్నీ ప్యాన్‌ ఇండియా స్థాయిలోనే తెరకెక్కుతున్నాయి. తాజాగా ఓంరౌత్‌ దర్శకత్వం వహిస్తున్న ‘ఆదిపురుష్‌’ చిత్రం కూడా 400 కోట్లకు పైగా బడ్జెట్‌తో భారీ స్థాయితో రూపొందుతుంది. రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రభాస్‌ రాముడిగా, కృతిసనన్‌ సీతగా కనిపించనున్నారు. బాలీవుడ్‌ స్టార్‌ సైఫ్‌ అలీఖాన్‌ లంకేశుడిగా నటిస్తున్నారు. తాజాగా ఆదిపురుష్‌ చిత్ర బడ్జెట్‌ తదితర ఆసక్తికర విషయాలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. స్వదేశీ, అంతర్జాతీయ భాషల్లో ఒకేసారి 20000 స్ర్కీన్‌లపై ఈ చిత్రం విడుదల కానుందని సమాచారం. అంతేకాదు.. ఇంగ్లిష్‌లోనూ ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఆ దిశగా నిర్మాణ సంస్థ ప్రయత్నాలు చేస్తుందని తెలిసింది. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. దీనిని బట్టి అభిమానులంతా ‘ఆదిపురుష్‌’ ప్యాన్‌ ఇండియా సినిమా కాదు.. ప్యాన్‌ వరల్డ్‌’ సినిమా అని పిలుచుకుంటున్నారు. 103 రోజుల్లో దర్శకుడు ఈ చిత్రం షూటింగ్‌ పూర్తి చేశారు దర్శకుడ. త్వరలో విడుదల తేది ప్రకటించే అవకాశం ఉంది. 


Updated Date - 2022-01-28T18:16:30+05:30 IST