‘బాహుబలి’ (Baahubali) ప్రాంచైజీతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న నటుడు ప్రభాస్ (Prabhas). ఈ సినిమా ఇచ్చిన ఇచ్చిన కిక్తో అతడు నటిస్తున్న సినిమాలన్ని పాన్ ఇండియాగా రూపొందుతున్నాయి. ‘బాహుబలి’ అనంతరం ‘సాహో’, ‘రాధే శ్యాం’ చిత్రాలు థియేటర్స్లోకి వచ్చినప్పటికీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని సాధించలేదు. తాజాగా ప్రభాస్ నటిస్తున్న చిత్రం ‘ఆదిపురుష్’ (Adipurush). ఓం రౌత్ దర్శత్వం వహిస్తున్నాడు. కృతి సనన్, సైఫ్అలీ ఖాన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ గతంలోనే పూర్తి అయింది. ప్రస్తుతం పొస్ట్ ప్రోడక్షన్ వర్క్ జరుగుతుంది. ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 12న ప్రపంచవ్యప్తంగా విడుదల కానుంది. ‘ఆదిపురుష్’ కు సంబంధించిన ఓ వార్త బాలీవుడ్ మీడియాలో విపరీతంగా హల్చల్ చేస్తుంది. భారతీయ సినిమా చరిత్రలోనే ‘ఆదిపురుష్’ డిజిటల్ రైట్స్ అత్యధిక ధరకు అమ్ముడయ్యాయని తెలుస్తోంది.
‘ఆదిపురుష్’ పాన్ ఇండియాగా తెరకెక్కుతుంది. ఈ మూవీకీ సంబంధించిన అన్ని భాషల డిజిటల్ హక్కులను ఓటీటీ దిగ్గజం నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఓటీటీ ప్లాట్ఫాం రూ. 250కోట్లకు ఈ హక్కులను కొనుగోలు చేసిందని ఇండస్ట్రీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ వార్తలు కనుక నిజమైతే సినిమాకు పెట్టిన సగం బడ్జెట్ ఓటీటీ రైట్స్ రూపంలోనే వచ్చినట్టవుతుంది. ఈ సినిమాలో జానకీగా కృతి సనన్, రావణాసురుడిగా సైప్అలీ ఖాన్ కనిపించనున్నారు. ఈ చిత్రంలో భారీ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. రూ. 500కోట్ల భారీ బడ్జెట్తో ఈ మూవీని రూపొందిస్తున్నారు.