Adi saikumar: ‘తీస్ మార్ ఖాన్’ షూటింగ్ కంప్లీట్

ABN , First Publish Date - 2021-12-08T14:40:59+05:30 IST

యంగ్ హీరో ఆది సాయి కుమార్ నటిస్తున్న తాజా చిత్రం ‘తీస్ మార్ ఖాన్’. ఈ మూవీ షూటింగ్ పూర్తైంది. ఈ సినిమాలో ‘ఆర్ ఎక్స్ 100’ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ హీరోయిన్‌గా నటిస్తోంది.

Adi saikumar: ‘తీస్ మార్ ఖాన్’ షూటింగ్ కంప్లీట్

యంగ్ హీరో ఆది సాయి కుమార్ నటిస్తున్న తాజా చిత్రం ‘తీస్ మార్ ఖాన్’. ఈ మూవీ షూటింగ్ పూర్తైంది. ఈ సినిమాలో ‘ఆర్ ఎక్స్ 100’ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ హీరోయిన్‌గా నటిస్తోంది. జి గోగణ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని విజ‌న్ సినిమాస్ బ్యాన‌ర్‌పై నాగం తిరుప‌తి రెడ్డి నిర్మిస్తున్నారు. హై ఓల్టేజ్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్‌ను పూర్తి చేసినట్టు తాజాగా చిత్రబృందం ప్రకటించింది. ఆది సాయికుమార్ మూడు డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్న పాత్రల్లో కనిపించబోతున్నాడు. యాక్షన్, రొమాన్, ఫ్యామిలీ సెంటిమెంట్ అంశాలతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్‌ప్రొడక్షన్స్ కార్యక్రమాలు మొదలుపెట్టినట్టు సమాచారం. ఇక గోవాలో ఇటీవల ఆది సాయికుమార్, పాయల్ రాజ్‌పుత్‌పై చిత్రీకరించిన రొమాంటిక్ సాంగ్ మూవీకి హైలెట్‌గా నిలుస్తుందని చిత్రయూనిట్ అంటున్నారు. గతకొంత కాలంగా అటు ఆది సాయి కుమార్‌కు, ఇటు పాయల్‌కు ఆశించిన సక్సెస్ దక్కడం లేదు. చూడాలి మరి వీరిద్దరు కలిసి నటిస్తున్న ‘తీస్ మార్ ఖాన్’ మూవీతోనైనా మంచి అందుకుంటారేమో.

Updated Date - 2021-12-08T14:40:59+05:30 IST