ధర్మస్థలికి ఆపదొస్తే.. అలరిస్తున్న ‘ఆచార్య’ టీజర్!
ABN , First Publish Date - 2021-11-28T22:47:10+05:30 IST
‘ధర్మస్థలికి ఆపదొస్తే అది జయించడానికి అమ్మోరు తల్లి మాలో ఆవహించి ముందుకు పంపుతుంది’ అంటున్నారు రామ్ చరణ్. చిరంజీవితో కలిసి ఆయన నటిస్తున్న ‘ఆచార్య’ చిత్రంలోని డైలాగ్ ఇది. ఇందులో రామ్చరణ్ పోషించిన ‘సిద్ధ’ పాత్రకు సంబంధించిన టీజర్ను విడుదల చేశారు.
‘ధర్మస్థలికి ఆపదొస్తే అది జయించడానికి అమ్మోరు తల్లి మాలో ఆవహించి ముందుకు పంపుతుంది’ అంటున్నారు రామ్ చరణ్. చిరంజీవితో కలిసి ఆయన నటిస్తున్న ‘ఆచార్య’ చిత్రంలోని డైలాగ్ ఇది. ఇందులో రామ్చరణ్ పోషించిన ‘సిద్ధ’ పాత్రకు సంబంధించిన టీజర్ను విడుదల చేశారు. ఆయన లుక్, డైలాగ్ డిక్షన్ ఆకట్టుకునేలా ఉన్నాయి. ‘ధర్మస్థలికి ఆపదొేస్త.. అది జయించడానికి అమ్మోరుతల్లి మాలో ఆవహించి ముందుకు పంపుతుంది’ అంటూ చరణ్ పలికిన సంభాషణలు అభిమానులను అలరించే విధంగా ఉన్నాయి. ఇక సిద్థ టీజర్ చివరి సీన్లో సెలయేరుకు ఒకవైపు చిరుత పులి, దాని పిల్ల, మరోవైపు చిరంజీవి, రామ్చరణ్ ఒకే ఫ్రేమ్లో నీళ్లు తాగుతున్న సీన్ చూస్తుంటే ప్రేక్షకులకు పండగలాగే ఉంటుంది. ఈ చిత్రంలో చిరంజీవి సరసన కాజల్, చరణ్కు జోడీగా పూజాహెగ్డే నటిస్తున్నారు. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ సంస్థలు నిర్మిస్తున్న ఈ సినిమాకి కొరటాల శివ దర్శకుడు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 4న సినిమా విడుదల కానుంది.