ఉగాదికి ఆచార్య ఆగమనం
ABN , First Publish Date - 2022-01-17T06:31:07+05:30 IST
చిరంజీవి, రామ్చరణ్ కథానాయకులుగా నటించిన ‘ఆచార్య’ చిత్రం ఉగాది సందర్భంగా ఏప్రిల్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది...
చిరంజీవి, రామ్చరణ్ కథానాయకులుగా నటించిన ‘ఆచార్య’ చిత్రం ఉగాది సందర్భంగా ఏప్రిల్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. కొత్త రిలీజ్ డేట్ను చిత్రయూనిట్ ఆదివారం ప్రకటించింది. కొరటాల శివ దర్శకత్వంలో నిరంజన్రెడ్డి, అన్వేష్రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఫిబ్రవరి 4న విడుదల చేయాలనుకున్నారు. కానీ కొవిడ్ ప్రభావం వల్ల ‘ఆచార్య’ను ఉగాదికి రిలీజ్ చేస్తున్నారు. చిరంజీవికి జోడీగా కాజల్ అగర్వాల్, చరణ్కు జంటగా పూజాహెగ్డే నటించారు. మణిశర్మ సంగీతం అందించారు.