Abhishek Bachchan: మూవీ సెట్లో స్టార్ హీరో దొంగతనం.. ఇంతకీ అదేంటంటే..
ABN , First Publish Date - 2022-08-08T19:48:36+05:30 IST
బాలీవుడ్లో మంచి పాపులారిటీ ఉన్న హీరోల్లో అభిషేక్ బచ్చన్ ఒకరు. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్బచ్చన్ వారసుడిగా..
బాలీవుడ్లో మంచి పాపులారిటీ ఉన్న హీరోల్లో అభిషేక్ బచ్చన్ (Abhishek Bachchan) ఒకరు. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్బచ్చన్ (Amitabh Bachchan) వారసుడిగా చిత్ర పరిశ్రమకి ఎంట్రీ ఇచ్చి తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. అభిషేక్ తాజాగా నటించిన చిత్రం ‘దస్వీ’. ఓ అవినీతి సీఎం జైలుకి వెళతాడు. ఆ సందర్భంలో పదో తరగతి చదవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. ఈ తరుణంలో ఆయన భార్య సీఎం కుర్చీలో కూర్చుని జైలులోని భర్తని ఇబ్బంది పెడుతుంది. అటువంటి డిఫరెంట్ కథతో తెరకెక్కిన ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్లో విడుదలై మంచి టాక్ని సొంతం చేసుకుంది.
అయితే.. బాలీవుడ్ నటుడు రితేశ్ దేశ్ముఖ్ ‘కేస్ తో బంటా’ అనే షోకి హోస్ట్గా వ్యవహరిస్తున్నాడు. అమెజాన్ మినీ టీవీ (Amazon Mini Tv)లో ప్రసారం అవుతున్న ఈ టాక్ షోలో పలువురు సెలబ్రిటీలు గెస్టులుగా వచ్చారు. దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో.. విక్కీ కౌశల్, సారా అలీఖాన్, సంజయ్ దత్, అనిల్ కపూర్, అభిషేక్ బచ్చన్ వంటి ప్రముఖులు ఉన్నారు.
అందులో భాగంగా.. అభిషేక్ని నువ్వు గురు మూవీ సెట్లో ఏదో దొంగతనం చేశావంటా అని రితేష్ అడిగాడు. దానికి కొంచెం ఇబ్బంది పడిన అభిషేక్ కొద్దిసేపటికీ.. ‘హీరోయిన్ని దొంగతనం చేశాను’ అని ఫన్నీగా చెప్పుకొచ్చాడు. ఎందుకంటే.. ‘గురు’ సినిమాలో హీరోయిన్ ఎవరో కాదు. ఆయన భార్య ఐశ్వర్యారాయ్ (aishwarya rai). అందుకే అభిషేక్ అలా చెప్పగలిగాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.