ఓ మంచి భూతం కథ

ABN , First Publish Date - 2022-07-13T05:43:37+05:30 IST

ప్రభుదేవా కథానాయకుడిగా నటించిన చిత్రం ‘మై డియర్‌ భూతం’. ఎన్‌.రాఘవన్‌ దర్శకుడు. రమేష్‌ పి.పిళ్లై నిర్మాత...

ఓ మంచి భూతం కథ

ప్రభుదేవా కథానాయకుడిగా నటించిన చిత్రం ‘మై డియర్‌ భూతం’. ఎన్‌.రాఘవన్‌ దర్శకుడు. రమేష్‌ పి.పిళ్లై నిర్మాత. శనివారం హైదరాబాద్‌లో ట్రైలర్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రభుదేవా మాట్లాడుతూ ‘‘తెలుగు చిత్రసీమ నా పుట్టిల్లు లాంటిది. ఇక్కడ మంచి చిత్రాలకు తప్పకుండా ఆదరణ లభిస్తుంది. ఇదో ప్రయోగాత్మక చిత్రం. పిల్లలకు, పెద్దలకూ నచ్చుతుంది. చల్లా భాగ్యలక్ష్మి రాసిన పాటలు బాగున్నాయ’’న్నారు. ‘‘ఈ సినిమా కోసం ప్రభుదేవా 45 రోజుల పాటు కష్టపడ్డారు. ఆ కష్టం తెరపై కనిపిస్తుంద’’న్నారు దర్శకుడు. జులై 15న ఈ చిత్రాన్ని విడుదల చేస్తారు. 

Updated Date - 2022-07-13T05:43:37+05:30 IST