ఓ సామాన్యుడి యుద్ధం

ABN , First Publish Date - 2022-01-21T10:02:10+05:30 IST

విశాల్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘సామాన్యుడు’. శరవణన్‌ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. డింపుల్‌ హయతి కథానాయిక...

ఓ సామాన్యుడి యుద్ధం

విశాల్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘సామాన్యుడు’. శరవణన్‌ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. డింపుల్‌ హయతి కథానాయిక. చిత్రీకరణ పూర్తయింది. త్వరలో విడుదల చేస్తారు. ఇటీవల విడుదల చేసిన ట్రైలర్‌కి మంచి స్పందన వచ్చింది. ఈ సందర్భంగా విశాల్‌ మాట్లాడుతూ ‘‘ఓ సామాన్యుడి పోరాటం ఈ కథ. యాక్షన్‌కి పెద్ద పీట వేశాం. కథలో మలుపులు ఆకట్టుకుంటాయి. ఇందులో చక్కటి లవ్‌ స్టోరీ కూడా ఉంది. ఆ ట్రాక్‌ అందరికీ నచ్చుతుంది. నా ప్రతి సినిమాలోనూ ఏదో ఓ సందేశం ఉంటుంది. ఈ కథలోనూ అది కనిపిస్తుంది. త్వరలోనే విడుదల తేదీ ప్రకటిస్తామ’’న్నారు. 


Updated Date - 2022-01-21T10:02:10+05:30 IST