ఓ సామాన్యుడి యుద్ధం
ABN , First Publish Date - 2022-01-21T10:02:10+05:30 IST
విశాల్ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘సామాన్యుడు’. శరవణన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. డింపుల్ హయతి కథానాయిక...
విశాల్ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘సామాన్యుడు’. శరవణన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. డింపుల్ హయతి కథానాయిక. చిత్రీకరణ పూర్తయింది. త్వరలో విడుదల చేస్తారు. ఇటీవల విడుదల చేసిన ట్రైలర్కి మంచి స్పందన వచ్చింది. ఈ సందర్భంగా విశాల్ మాట్లాడుతూ ‘‘ఓ సామాన్యుడి పోరాటం ఈ కథ. యాక్షన్కి పెద్ద పీట వేశాం. కథలో మలుపులు ఆకట్టుకుంటాయి. ఇందులో చక్కటి లవ్ స్టోరీ కూడా ఉంది. ఆ ట్రాక్ అందరికీ నచ్చుతుంది. నా ప్రతి సినిమాలోనూ ఏదో ఓ సందేశం ఉంటుంది. ఈ కథలోనూ అది కనిపిస్తుంది. త్వరలోనే విడుదల తేదీ ప్రకటిస్తామ’’న్నారు.