అమెజాన్ ప్రైమ్లో ‘క్షీర సాగర మథనం’కు 10 కోట్ల వ్యూస్
ABN , First Publish Date - 2021-10-16T02:34:36+05:30 IST
‘బిగ్ బాస్’ ఫేమ్ మానస్ నాగులపల్లి, నటుడు బ్రహ్మాజీ తనయుడు సంజయ్ కుమార్, అక్షత సోనావని, చరిష్మా శ్రీకర్, ప్రదీప్ రుద్ర ప్రధాన తారాగణంగా రూపొందిన చిత్రం ‘క్షీర సాగర మథనం’. అనిల్ పంగులూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సెప్టెంబర్ 4న
‘బిగ్ బాస్’ ఫేమ్ మానస్ నాగులపల్లి, నటుడు బ్రహ్మాజీ తనయుడు సంజయ్ కుమార్, అక్షత సోనావని, చరిష్మా శ్రీకర్, ప్రదీప్ రుద్ర ప్రధాన తారాగణంగా రూపొందిన చిత్రం ‘క్షీర సాగర మథనం’. అనిల్ పంగులూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సెప్టెంబర్ 4న అమెజాన్ ప్రైమ్లో విడుదలైన విషయం తెలిసిందే. ముందు థియేటర్లలో విడుదలై మంచి టాక్ని సొంతం చేసుకున్న ఈ చిత్రం, ఆ తర్వాత విడుదలైన అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో కూడా మంచి స్పందనను రాబట్టుకుంటోంది. ఇప్పటి వరకు ఈ చిత్రానికి అమెజాన్ ప్రైమ్లో 10 కోట్ల వ్యూస్ వచ్చినట్లుగా చెబుతూ.. చిత్రయూనిట్ ఆనందం వ్యక్తం చేసింది. ప్రైమ్లో విడుదలైన మూడు నాలుగు రోజులకే టాప్-2లో స్థానం సంపాదించుకున్న ఈ చిత్రం ఇప్పటికీ టాప్ 5లో కొనసాగుతుండడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు చిత్ర దర్శకుడు అనిల్ పంగులూరి. ఓటీటీలో తమ చిత్రానికి ఆడియన్స్ బ్రహ్మరథం పడుతుండడంపై ఉక్కిరిబిక్కిరి అవుతున్నామని తెలుపుతూ.. ప్రేక్షకులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. శ్రీ వెంకటేశ్వర పిక్చర్స్తో కలిసి ఆర్ట్ అండ్ హార్ట్ క్రియేషన్స్ పతాకంపై రూపొందిన ఈ చిత్రం ఆగస్ట్ 6న థియేటర్లలో విడుదలైంది.