Pelli Kaani Prasad: మరోసారి అదృష్టం పరీక్షించుకోబోతున్న సప్తగిరి

ABN , Publish Date - Feb 24 , 2025 | 06:36 PM

కమెడియన్ సప్తగిరి గతంలో పలు చిత్రాలలో హీరోగా నటించాడు. ఇప్పుడు కాస్తంత గ్యాప్ తర్వాత అతను హీరోగా నటించిన మరో సినిమా 'పెళ్ళికాని ప్రసాద్' విడుదల కాబోతోంది.

ప్రముఖ హాస్యనటుడు సప్తగిరి (Sapthagiri) హీరోగా కొన్ని చిత్రాలలో నటించాడు. అందులో కొన్ని సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. అయితే ఆ తర్వాత మాత్రం ఆశించిన స్థాయిలో కొన్ని ఆడకపోగా మరికొన్ని విడుదల కాకుండా ఆగిపోయాయి. దాంతో తిరిగి హాస్య పాత్రలు చేయడం మొదలెట్టాడు సప్తగిరి. అయితే... తనకు సరిపోయే కథ ఏదైనా దొరికితే... హీరోగా నటించడానికి వెనకాడటం లేదు. అలా తెరకెక్కిందే 'పెళ్ళికాని ప్రసాద్'. వెంకటేశ్ నటించిన 'మల్లీశ్వరి' సినిమాలో అతన్ని 'పెళ్ళికాని ప్రసాద్' అని అందరూ సంభోదిస్తుంటారు. దాంతో బాగా పాపులర్ అయిన ఆ డైలాగ్ తోనే ఆ తర్వాత ఓ సినిమా కూడా వచ్చింది. ఇప్పుడు అదే టైటిల్ ను మరోసారి సప్తగిరి సినిమాకు పెట్టారు. ఫిబ్రవరి 24న ఈ మూవీ నుండి ఫస్ట్ లుక్ విడుదలైంది.

...


'పెళ్ళికాని ప్రసాద్' మూవీని అభిలాష్ రెడ్డి గోపిడి (Abhilash Reddy Gopidi) దర్శకత్వంలో కె.వై. బాబు, భాను ప్రకాశ్‌ గౌడ్, సుక్కా వెంకటేశ్వర్ గౌడ్, వైభవ్ రెడ్డి ముత్యాల నిర్మిస్తున్నారు. శేఖర్ చంద్ర (Sekhar Chadra) సంగీతం అందించిన ఈ సినిమాలో ప్రియాంక శర్మ (Priyanka Sharma) హీరోయిన్ గా నటించింది. మురళీధర్ గౌడ్, లక్ష్మణ్, అన్నపూర్ణమ్మ కీలక పాత్రలు పోషించారు. విశేషం ఏమంటే ఈ సినిమా మార్చి 21న దిల్ రాజుకు చెందిన ఎస్.వి.సి. సంస్థ విడుదల చేయబోతోంది.

Updated Date - Feb 24 , 2025 | 06:36 PM