Akhanda 2: కుంభమేళాలో బోయపాటి టీమ్ సందడి...
ABN , Publish Date - Jan 16 , 2025 | 02:34 PM
నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘అఖండ 2: తాండవం’. ప్రపంచంలోనే పెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమమైన మహా కుంభమేళాలో ‘అఖండ 2’ చిత్రం కొత్త షెడ్యూల్ చిత్రీకరణ జరుగుతోంది
నందమూరి బాలకృష్ణ (NBK) హీరోగా బోయపాటి శ్రీను (Boyapati Srinu) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘అఖండ 2: తాండవం’ (Akahnda 2: Thandavam) . ప్రపంచంలోనే పెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమమైన మహా కుంభమేళాలో ‘అఖండ 2’ చిత్రం కొత్త షెడ్యూల్ చిత్రీకరణ జరుగుతోంది. దీనిని ఉద్దేశించి తాజాగా దర్శకుడు బోయపాటి శ్రీను స్పందించారు.
‘‘మహా కుంభమేళాలో ఏర్పాట్లు అద్భుతంగా ఉన్నాయి. దాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. షూట్ కోసం మేము ఇక్కడికి వచ్చాం. అఘోరా నేపథ్యంలో సాగే కథ ఇది. సినిమాలోని కొన్ని సన్నివేశాలను ఇక్కడ చిత్రీకరించేందుకు వచ్చాం. జనవరి 11 నుంచి ఇక్కడే ఉన్నాం. ఈ రోజుతో ఇక్కడ షూట్ పూర్తవుతుంది. నాగసాఽధువులు, అఘోరాలను కలిశాం. మా ప్రయత్న లోపం లేకుండా చిత్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దేందుకు అన్ని విధాల శ్రమిస్తున్నాం’’ అని బోయపాటి శ్రీను చెప్పారు. 2021లో బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల కాంబినేషన్లో వచ్చిన అఖండ చిత్రానికి కొనసాగింపుగా అఖండ-2: తాండవం తెరకెక్కుతోంది. 14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మిస్తున్నారు. ఎం.తేజస్విని సమర్పకులు. బోయపాటి, బాలయ్య కాంబోతో వస్తున్న నాలుగో చిత్రమిది. సెప్టెంబర్ 25న ఈ చిత్రానికి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.