Taapsee Pannu: 15 ఏళ్లలో తొలిసారి ఆ దర్శకుడు నన్ను ఆహ్వానించాడు

ABN , Publish Date - Jan 29 , 2025 | 07:44 AM

15 ఏళ్లలో తొలిసారి నాకు ఎంతో ఇష్టమైన దర్శకుడి సినిమా వేడుకకు ఆహ్వానం వచ్చిందని అన్నారు హీరోయిన్ తాప్సీ. తాజాగా ఆమె ‘బ్యాడ్‌గర్ల్’ అనే చిత్ర టీజర్ లాంచ్ వేడుకలో పాల్గొన్నారు. ఈ వేడుక చెన్నైలో జరిగింది. మరి తాప్సీ చెబుతున్న ఆ ఇష్టమైన దర్శకుడు ఎవరు? ఏంటా కథ? అనే విషయంలోకి వస్తే..

Taapsee Pannu

బాలీవుడ్‌ దర్శక నటుడు అనురాగ్‌ కశ్యప్‌, కోలీవుడ్‌ దర్శకుడు వెట్రిమారన్‌ సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘బ్యాడ్‌గర్ల్‌’. తాజాగా ఈ సినిమా టీజర్‌ను చెన్నై నగరంలో జరిగిన వేడుకలో విడుదల చేశారు. గ్రాస్‌రూట్‌ ఫిల్మ్‌ కంపెనీ పతాకంపై తెరకెక్కిన ఈ మూవీకి బాలీవుడ్‌ సంగీత దర్శకుడు అమిత్‌ త్రివేది స్వరాలు సమకూర్చారు. ఈయన తమిళ చిత్రానికి సంగీతం అందించడం ఇదే తొలిసారి. దర్శకుడు వెట్రిమారన్‌ వద్ద ‘వడ చెన్నై’, ‘విచారణై’ వంటి సినిమాలకు అసిస్టెంట్‌‌గా పనిచేసిన వర్షా భరత్‌ ఈ సినిమా ద్వారా దర్శకురాలిగా పరిచయమవుతున్నారు. ‘కమింగ్‌ ఆఫ్‌ ఏజ్‌ ఫ్యామిలీ డ్రామా’గా రూపొందిన ఈ మూవీలో ప్రధాన పాత్రను అంజలి శివరామన్‌ పోషించగా.. శాంతిప్రియ, హృద్‌ హారూన్‌, టీజే అరుణాచలం, శరణ్య రవిచంద్రన్‌ తదితరులు ఇతర పాత్రలలో నటించారు. ప్రస్తుతం ఈ సినిమా తుదిదశ చిత్రీకరణ జరుపుకుంటోంది.


Also Read- సచిన్ కుమార్తె.. సామాన్యమైనది కాదండోయ్!

ఈ టీజర్ లాంచ్ వేడుకకు ప్రముఖ నిర్మాత కలైపులి ఎస్‌.థాను, దర్శకుడు మిష్కిన్‌, హీరోయిన్‌ తాప్సీ ముఖ్య అతిథులుగా పాల్గొని టీజర్‌ రిలీజ్‌ చేశారు. ఈ సందర్భంగా నిర్మాత థాను మాట్లాడుతూ, ఒక చిత్రం విజయానికి కొత్తదనంతో కూడిన పబ్లిసిటీ ముఖ్యం. నా వంతుగా ఈ టీజర్‌ను మరింత మందికి చేరువచేస్తాను. మీడియా కూడా ఆదరించాలని కోరారు. దర్శకురాలు వర్ష మాట్లాడుతూ.. వెట్రిమారన్‌కు కథలు చెబుతూనే ఉంటాం. వాటిని ఆలకించే ఆయన ఫీడ్‌బ్యాక్‌ ఇస్తుంటారు. అలాంటి మంచి ఫీడ్‌బ్యాక్‌ ఈ స్టోరీకి ఇచ్చారు. తమిళ సంప్రదాయంలో మహిళను తల్లితో సమానంగా చూస్తారు. కానీ, ఒక మహిళలోని నిజమైన భావాలు ఏమిటో చెప్పే కథ ఇదని పేర్కొన్నారు.


Bad-Girl.jpg

హీరోయిన్‌ తాప్సీ మాట్లాడుతూ.. ‘‘15 ఏళ్లలో తొలిసారి వెట్రిమారన్‌ ఒక సినిమాకు నన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. ‘బ్యాడ్‌గర్ల్’ నాకు ఆ అవకాశం కల్పించింది. తరచూ పురుషులకు సంబంధించిన చిత్రాలే వస్తుంటాయి, మహిళలకు సంబంధించిన చిత్రాలు ఎందుకు రావడం లేదని ఆశ్చర్యపోతుంటాను. ఈ సినిమా కేవలం స్త్రీల సమస్యలను ప్రస్తావిస్తుంది. మహిళ గొప్పతనాన్ని తెలియజేస్తుంది. దర్శకురాలు కూడా మహిళే. ఈ సినిమా విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని తెలిపారు. ఇంకా వెట్రిమారన్‌, అనురాగ్‌ కశ్యప్‌, అంజలి శివరామన్‌, దర్శకుడు మిష్కిన్‌ తదితరులు ప్రసంగించారు. ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకురానుంది.


Also Read- Anil Ravipudi: ఇండస్ట్రీలోకి రాకముందే అనిల్ ప్రేమకి సహాయం చేసిన నటులు

Also Read- Padma Bhushan Puraskar 2025: బాలయ్యతో పాటుగా పద్మ భూషణ్ పొందిన నటులెవరంటే..

Also Read- Mass Jathara Teaser: జాతర కాదు.. ర్యాంపేజ్.. ‘మనదే ఇదంతా’!

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Jan 29 , 2025 | 07:44 AM