Wedding: ప్రముఖుల సమక్షంలో బంగారు బాబు కుమారుడి వివాహం

ABN , Publish Date - Apr 14 , 2025 | 12:10 PM

ప్రముఖ ఫిల్మ్ ఫైనాన్షియర్ బంగారు బాబు కుమారుడు క్రాంతి రెడ్డి వివాహం ఫార్మా ఇండస్ట్రీస్ అధినేత సీతారామిరెడ్డి కుమార్తె శిరీషతో ఘనంగా జరిగింది.

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎన్నో చిత్రాలకు ఫైనాన్స్ చేసిన ప్రముఖ ఫిలిం ఫైనాన్షియర్, ఆర్. సెక్యూర్డ్ ఫైనాన్స్ అధినేత బంగారు బాబు (ఈవీ రెడ్డి రాజారెడ్డి) చిన్న కుమారుడు క్రాంతి రెడ్డి వివాహం శనివారం హైటెక్స్ కన్వెన్షన్ సెంటర్ లో ఘనంగా జరిగింది. ఫార్మారంగంలో గొప్ప శక్తిగా ఎదిగిన పారిశ్రామిక దిగ్గజం బాలాజీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేత సీతారామిరెడ్డి - రామ సీత దంపతుల కుమార్తె శిరీషని క్రాంతి రెడ్డి వివాహం చేసుకున్నారు. బంగారు బాబుకు సినిమా రంగంతో ఉన్న విశేష అనుబంధం నేపథ్యంలో ఈ వివాహ వేడుకకు పలువురు సినీ ప్రముఖులు విచ్చేసి నూతన వధూవరులకు శుభాశీస్సులు అందజేశారు.


Photos (19).jpgప్రముఖ నటీనటులు డాక్టర్ మురళీమోహన్, నట కిరీటి రాజేంద్రప్రసాద్, లేడీ సూపర్ స్టార్ విజయశాంతి, సహజనటి జయసుధ, ప్రముఖ నటులు, నిర్మాత, దర్శకుడు ఆర్. నారాయణ మూర్తి, సాయికుమార్, రఘు బాబు, దాసరి అరుణకుమార్ తదితరులతోపాటు అగ్రశ్రేణి నిర్మాతలు అల్లు అరవింద్, దిల్ రాజు, కె.ఎస్. రామారావు, సి. కళ్యాణ్, సునీల్ నారంగ్, జెమినీ కిరణ్, మైత్రి మూవీ మేకర్స్ అధినేతలు రవి, యెర్నేని నవీన్, లగడపాటి శ్రీధర్, డాక్టర్ వెంకటేశ్వరరావు, కె.ఎల్. కుమార్ చౌదరి, కె. అచ్చిరెడ్డి, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అధినేత విశ్వ ప్రసాద్, బండ్ల గణేష్ తదితరులు హాజరయ్యారు.


Photos (8).jpgప్రముఖ దర్శకులు సుకుమార్, హరీష్ శంకర్, ఎస్.వి. కృష్ణారెడ్డి, రేలంగి నరసింహారావు, బి.గోపాల్ వంటి దిగ్గజ దర్శకులు కూడా ఈ వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. అలాగే ఆంధ్రజ్యోతి అధినేత వేమూరి రాధాకృష్ణతో పాటు వైజాగ్ ఎంపీ భరత్, కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి వంటి రాజకీయ ప్రముఖులు కూడా ఈ వేడుకకు హాజరయ్యారు. తమ పట్ల అభిమానంతో ఈ వివాహ మహోత్సవానికి విచ్చేసి నూతన దంపతులను ఆశీర్వదించిన సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులుకు బంగారు బాబు కృతజ్ఞతలు తెలియజేశారు.

Photos (15).jpg

Updated Date - Apr 14 , 2025 | 12:10 PM