Premaku Jai: తెరపై చూడని లవ్స్టోరీ 'ప్రేమకు జై'
ABN , Publish Date - Apr 11 , 2025 | 12:22 AM
గ్రామీణ నేపథ్యంలో యాదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన చిత్రం 'ప్రేమకు జై' (Premaku Jai) .
గ్రామీణ నేపథ్యంలో యాదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన చిత్రం 'ప్రేమకు జై' (Premaku Jai) . అనిల్ బురగాని, జ్వలిత జంటగా, శ్రీనివాస్ మల్లం దర్శకత్వంలో అనసూర్య నిర్మించిన ఈ సినిమా ఈ నెల 11న థియేటర్లలో విడుదల అవుతోంది. ఇప్పటి వరకు తెరపై చూడని ఓ లవ్స్టోరీని చూపించబోతున్నట్టు చిత్రయూనిట్ ప్రకటించింది. ప్రచార చిత్రాలు ఇప్పటికే వైరల్గా మారాయి.
ఈ సందర్భంగా 'ప్రేమకు జై' దర్శకుడు మల్లం శ్రీనివాస్ మాట్లాడుతూ ''పల్లెటూరి నేపథ్యంలో వాస్తవంగా జరిగిన ఓ సంఘటన ఆధారంగా ఈ సినిమా తెరకెక్కించాం. మా హీరో హీరోయిన్లు అనిల్ బురగాని, జ్వలిత బాగా చేశారు. మా టీం అందరి కృషి వల్ల ఈ సినిమా ఇంత బాగా వచ్చింది. క్వాలిటీ విషయంలో నిర్మాత రాజీ పడలేదు. ఎంతో సహకరించారు. శుక్రవారం థియేటర్లలో విడుదలయ్యే ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నాం'' అని అన్నారు.