మధురానుభూతినిస్తుంది

ABN , Publish Date - Apr 13 , 2025 | 01:43 AM

‘దియా’ ఫేమ్‌ పృథ్వీ అంబర్‌ ప్రధానపాత్రలో సాయిరాజేశ్‌ మహదేవ్‌ తెరకెక్కించిన చిత్రం ‘డియర్‌ ఉమ’. సుమయ రెడ్డి హీరోయిన్‌గా నటించి నిర్మించారు. ఈ నెల 18న...

‘దియా’ ఫేమ్‌ పృథ్వీ అంబర్‌ ప్రధానపాత్రలో సాయిరాజేశ్‌ మహదేవ్‌ తెరకెక్కించిన చిత్రం ‘డియర్‌ ఉమ’. సుమయ రెడ్డి హీరోయిన్‌గా నటించి నిర్మించారు. ఈ నెల 18న సినిమా విడుదలవుతోంది. కమల్‌ కామరాజు, సప్తగిరి, అజయ్‌ ఘోష్‌, ఆమని తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇటీవలె విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్‌, టీజర్‌ ఆకట్టుకున్నాయి. తాజాగా, ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాత, హీరోయిన్‌ సుమయ రెడ్డి మాట్లాడుతూ ‘‘మంచి కంటెంట్‌తో చేసిన విభిన్నమైన ప్రయత్నం ఇది. సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అని అన్నారు. ‘‘ప్రేక్షకులకు మధురానుభూతినిచ్చే సినిమా ఇది’’ అని హీరో పృథ్వీ అంబర్‌ చెప్పారు.

Updated Date - Apr 13 , 2025 | 01:43 AM