Yearender 2024: అధికంగా టిక్కెట్లు అమ్ముడైన సినిమాలు
ABN , Publish Date - Dec 24 , 2024 | 05:14 AM
ఈ ఏడాదిలో విడుదలైన చాలా చిత్రాలు ప్రేక్షకులను అలరించాయి. కల్కి 2898, పుష్ప-2, దేవర, భూల్ భులయ్య-3 వంటి చిత్రాలు బాక్సాఫీసు వద్ద భారీ వసూళ్లను రాబట్టాయి. బుక్ మై షోలో అత్యధిక టిక్కెట్లు అమ్ముడైన....
ఈ ఏడాదిలో విడుదలైన చాలా చిత్రాలు ప్రేక్షకులను అలరించాయి. కల్కి 2898, పుష్ప-2, దేవర, భూల్ భులయ్య-3 వంటి చిత్రాలు బాక్సాఫీసు వద్ద భారీ వసూళ్లను రాబట్టాయి. బుక్ మై షోలో అత్యధిక టిక్కెట్లు అమ్ముడైన చిత్రంగా పుష్ప-2 రికార్డు సృష్టించింది. ఈ నేపథ్యంలో 2024లో విడుదల రోజున అత్యధిక సంఖ్యలో టిక్కెట్లు అమ్మిన చిత్రాలేమిటో చూద్దాం...!
పుష్ప-2: అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమిది. వరల్డ్ వైడ్గా డిసెంబరు 5న విడుదలై భారీ కలెక్షన్లతో రికార్డును బ్రేక్ చేస్తోంది. విడుదల రోజున ఒక్క గంటలో సుమారుగా లక్షకు పైగా టిక్కెట్లు అమ్ముడవడం విశేషం.
కల్కి 2898: ప్రభాస్ నటించిన ఈ చిత్రం జూన్ 27న విడుదలైంది. తొలి రోజు గంటకు 96 వేలకు పైగా టిక్కెట్లు సేల్ అయ్యాయి.
దేవర: జూనియర్ ఎన్టీఆర్, జాన్వీకపూర్ జంటగా నటించిన ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో సెప్టెంబరు 27న విడుదలైంది. మొదటి రోజు సుమారు 15 లక్షలకు పైగా టిక్కెట్లను విక్రయించారు.
స్త్రీ-2: ఆగస్టు 15న విడుదలైన ఈ హిందీ సినిమా మొదటి రోజు సుమారు లక్షా ఇరవై నాలుగు వేలకు పైగా టిక్కెట్లు అమ్ముడు పోయాయి.
భూల్ భులయ్య-3: ఈ హిందీ చిత్రం నవంబరు 1న విడుదలైంది. కార్తీక్ ఆర్యన్, విద్యా బాలన్, మాధురి దీక్షిత్ ప్రధాన తారాగణం. చిత్రం ఓపెనింగ్ రోజు 2,29,558 టిక్కెట్లు అమ్మారు. బాక్సాఫీ వద్ద అత్యధిక వసూళ్లు చేసిన రెండో హిందీ చిత్రం, ఐదో భారతీయ సినిమాగా నిలిచింది.
అమరన్: శివకార్తికేయన్, సాయిపల్లవి జంటగా నటించిన ఈ చిత్రం అక్టోబరు 31న విడుదలైంది. చిత్రం విడుదల రోజున తొలి నాలుగు గంటల్లో 1,36, 890 టిక్కెట్లు విక్రయించారు.
ఫైటర్: హృతిక్ రోషన్, దీపికా పదుకొనే జంటగా నటించిన ఈ హిందీ చిత్రం జనవరి 25 విడులైంది. తొలి రోజు 2,79,00 టిక్కెట్లు విక్రయించారు.
హనుమాన్: తేజ సజ్జా, అమృత అయ్యర్ జంటగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కింది. జనవరి 12న విడుదల కాగా తొలిరోజున 3,36,000 టిక్కెట్లు అమ్మారు.
ద గోట్: విజయ్ నటించిన ఈ సినిమా సెప్టెంబరు 5న విడుదలైంది. తొలి రోజు ఒక్క తమిళనాడులోనే ఆరు లక్షలకు పైగా టిక్కెట్లు విక్రయించారు.
ద సింగమ్ ఎగైన్: అజయ్ దేవ్గన్, రణ్వీర్ సింగ్, దీపికా పదుకొనే ప్రధాన తారాగణంగా నటించిన ఈ మూవీ నవంబరు 1న విడుదలైంది. 2,26,000 టిక్కెట్లు విక్రయించారు.