Chiranjeevi: పారిస్ సమ్మర్ ఒలింపిక్స్‌కి వెళుతూ.. చిరు ట్వీట్ వైరల్

ABN , Publish Date - Jul 24 , 2024 | 06:38 PM

సమ్మర్ ఒలింపిక్స్ 24 ప్రారంభ వేడుక ఆహ్వానిస్తోంది అంటూ మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ వేదికగా ఫ్యామిలీతో ఉన్న పిక్‌ని షేర్ చేశారు. ఇప్పుడీ ఫొటో వైరల్ అవుతోంది. ఈ పోస్ట్‌లో ఆయన చేసిన పిక్‌లో చిరు సతీమణి సురేఖ కొణిదెల, కుమారుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, కోడలు ఉపాసన, మనవరాలు క్లీంకార ఉన్నారు. వీరంతా పార్క్‌లో హాయిగా ముచ్చట్లు చెప్పుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు.

Megastar Chiranjeevi with Family

సమ్మర్ ఒలింపిక్స్ 24 ప్రారంభ వేడుక ఆహ్వానిస్తోంది అంటూ మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) ట్విట్టర్ వేదికగా ఫ్యామిలీతో ఉన్న పిక్‌ని షేర్ చేశారు. ఇప్పుడీ ఫొటో వైరల్ అవుతోంది. ఎప్పుడు కాస్త గ్యాప్ దొరికినా.. ఫ్యామిలీతో టూర్ వేసే వాళ్లలో టాలీవుడ్ నుంచి సూపర్ స్టార్ మహేష్ బాబు ముందు వరసలో ఉంటారు. ఆయన ఫ్యామిలీకి టైమ్ కేటాయించినట్లుగా మరొకరు కేటాయించరనే విషయం అందరికీ తెలిసిందే. మహేష్ బాబు తర్వాత ఈ విషయంలో మెగాస్టార్ చిరంజీవే ఉంటారు. ఈ మధ్యకాలంలో కాస్త గ్యాప్ దొరికినా కూడా విశ్రాంతి కోసం చిరు ఫారెన్ వెళుతున్నారు. అయితే ఇప్పుడు ఆయన ఫారెన్ వెళ్లింది టూర్ కోసం కాదు.. పారిస్‌లో జరగనున్న సమ్మర్ ఒలింపిక్స్ 24 (Summer Olympics 24) ప్రారంభ వేడుకలకు హాజరయ్యేందుకు అని స్వయంగా మెగాస్టారే తన ట్వీట్‌లో రివీల్ చేశారు.

Also Read- Anasuya: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంతో డ్యాన్స్ నెంబర్ చేశా..

పారిస్ (Paris) వెళ్లే మార్గంలో లండన్‌లో ఫ్యామిలీతో ప్రశాంతమైన క్షణాలను ఆస్వాదిస్తున్నానని మెగాస్టార్ ట్విట్‌లో పేర్కొన్నారు. ‘‘రేపు పారిస్‌కు వెళ్లే మార్గమధ్యంలో.. లండన్‌లోని హైడ్ పార్క్‌ (Hyde Park London)లో ఫ్యామిలీ మరియు గ్రాండ్ లిటిల్ వన్ క్లీంకారతో ప్రశాంతమైన క్షణాలను ఆస్వాదిస్తున్నాను. సమ్మర్ ఒలింపిక్స్ 24 ప్రారంభ వేడుక పిలుస్తోంది’’ అంటూ మెగాస్టార్ చిరంజీవి పోస్ట్ చేశారు. ఈ పోస్ట్‌లో ఆయన చేసిన పిక్‌లో చిరు సతీమణి సురేఖ కొణిదెల, కుమారుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Global Star Ram Charan), కోడలు ఉపాసన, మనవరాలు క్లీంకార ఉన్నారు. వీరంతా పార్క్‌లో హాయిగా ముచ్చట్లు చెప్పుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు.


Mega-Family-Pic.jpg

ఇక మెగాస్టార్ చేసిన ఈ ట్వీట్‌కు నెటిజన్లు, ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఫ్యామిలీతో మెగాస్టార్ బాండింగ్ ఇదని కొందరు.. మీరెప్పుడూ ఇలాగే సంతోషంగా ఉండాలి బాసూ అంటూ మరికొందరు, ఇదే మీకు దక్కిన అరుదైన గౌరవం అని ఇంకొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఈ కామెంట్స్‌తో ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి చేసిన ఈ ట్వీట్ వైరల్ అవుతోంది.

Read Latest Cinema News

Updated Date - Jul 24 , 2024 | 06:38 PM