AP Elections 2024: అర్థమైందా రాజా, రోజా ని ట్రోల్ చేస్తున్న నెటిజన్స్

ABN , Publish Date - Jun 05 , 2024 | 12:01 PM

అప్పుడెప్పుడో సూపర్ స్టార్ రజినీకాంత్ పై నోరు పారేసుకున్న నటి, రాజకీయ నాయకురాలు రోజాని ఇప్పుడు అతని అభిమానులు ట్రోల్ చేస్తున్నారు. రజినీకాంత్ తో పెట్టుకుంటే ఎలా ఉంటుందో 'అర్థమైందా రాజా' అంటూ సామాజిక మాధ్యమాల్లో రోజాని, కొడాలి నానిని నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు.

AP Elections 2024: అర్థమైందా రాజా, రోజా ని ట్రోల్ చేస్తున్న నెటిజన్స్
Roja and Rajinikanth

తమిళ్ సూపర్ స్టార్ రజినీకాంత్ ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలకు అప్పట్లో ఒకసారి విజయవాడకి వచ్చారు. రజినీకాంత్, తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మంచి స్నేహితులు. ఎన్నో సంవత్సరాలనుంచి వారిద్దరి స్నేహం కొనసాగుతోంది. రజినీకాంత్ ఎప్పుడూ చంద్రబాబు పరిపాలనని ప్రశంసిస్తూ వుంటారు. అలాగే అప్పట్లో విజయవాడ వచ్చిన రజినీకాంత్ ఎన్టీఆర్ గురించి మాట్లాడారు, అలాగే ఆ తరువాత చంద్రబాబు గురించి ఎంతో గొప్పగా మాట్లాడేరు కూడా. (Super Star Rajinikanth fans now trolling Roja and Kodali Nani)

రజినీకాంత్ ఒక అగ్ర నటుడు, తనకన్నా సీనియర్ నటుడు, సహచర నటుడు అని చూడకుండా నటి, అప్పట్లో ఎంఎల్ఏ అయిన రోజా తనిష్టానుసారం నోరు పారేసుకున్నారు. రజినీకాంత్ కి ఆంధ్ర పాలిటిక్స్ ఏమి తెలుసు అని, రజినీకాంత్ పై ఇష్టానుసారం విమర్శలు చేశారు రోజా. ఆమెతో పాటు అప్పట్లో బూతు పురాణాలు ఎక్కువగా మాట్లాడుతూ వున్న కొడాలి నాని కూడా రజినీకాంత్ పై చాలా విమర్శలు చెయ్యడమే కాకుండా, కనీస గౌరవం ఇవ్వకుండా కూడా మాట్లాడేరు. (Rajinikanth fans now trolling Roja, after her huge defeat in the recent elections)

Roja.jpg

తరువాత ఒక సినిమా ఫంక్షన్ లో రజినీకాంత్ ఇలాంటివాళ్లనే ఉద్దేశించి మాట్లాడుతూ, 'మొరగని కుక్క ఉండదు, విమర్శించని నోరు ఉండదు, ఈ రెండూ లేని వూరు ఉండదు, అయినా మనపని మనం చేసుకుంటూ పోతూ ఉండాలి. అర్థమైందా రాజా', అని చెప్పారు. అప్పట్లో చెప్పిన రజినీకాంత్ మాటలు అప్పుడు వైరల్ అయ్యాయి, మళ్ళీ ఇప్పుడు నెటిజన్స్ అదే వీడియోని పెట్టి వైరల్ చేస్తున్నారు. ఆ వీడియోలో రోజా, కొడాలి నాని అప్పట్లో చెప్పిన మాటలు, తరువాత రజినీకాంత్ చెప్పిన మాటలు కూడా వీడియోలు ఎడిట్ చేసి పెడుతూ వైరల్ చేశారు. (Actress and politician Roja is now trolling by Rajinikanth fans for her earlier remarks on Rajinikanth)

ఈ ఇద్దరూ వైస్సార్సీపీ తరపున బూతుపురాణాలు ఎక్కువగా మాట్లాడిన వారిలో వున్నారు. నిన్నజరిగిన ఎన్నికల్లో ఈ ఇద్దరు నాయకులూ ఘోరంగా పరాభవం అయిన సంగతి తెలిసిందే. ఇద్దరూ కూడా కౌంటింగ్ జరుగుతున్న సమయంలోనే మధ్యలోనే బయటకి వచ్చేసి వెళ్లిపోయారు. అంటే ఈ ఇద్దరికీ మధ్యలోనే తెలిసిపోయింది, తాము ఘోరంగా ఓడిపోతున్నామని. అందుకే మధ్యలోనే వచ్చేసారు. వీళ్ళిద్దరినీ ముఖ్యంగా రోజాని బాగా ట్రోల్ చేస్తున్నారు నెటిజన్స్ సామాజిక మాధ్యమాల్లో.

Updated Date - Jun 05 , 2024 | 01:20 PM