Rashmika Mandanna: కన్నీళ్లతోనే వెనక్కి వచ్చేదాన్ని!

ABN , Publish Date - Aug 12 , 2024 | 08:57 PM

'పుష్ప'(Pushpa2) చిత్రంతో పాన్  ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా నేషనల్‌ క్రష్‌గా పేరొందింది Rashmika mandanna. ప్రస్తుతం టాలీవుడ్‌లోనే కాకుండా బాలీవుడ్‌లో మంచి అవకాశాలు అందుకుంటోంది.

'పుష్ప'(Pushpa2) చిత్రంతో పాన్  ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా నేషనల్‌ క్రష్‌గా పేరొందింది Rashmika mandanna. ప్రస్తుతం టాలీవుడ్‌లోనే కాకుండా బాలీవుడ్‌లో మంచి అవకాశాలు అందుకుంటోంది.  తాజాగా ఓ షోలో పాల్గొన్న ఆమె ఆసక్తికర విషయాలు చెప్పింది. ఇప్పుడంటే నన్నుస్టార్‌ హీరోయిన్ గా అందరూ అనుకుంటున్నారు. ఒకప్పుడు నేను కూడా సాధారణ నటినే. ఇప్పటికీ అలాగే అనుకుంటా. ఎందుకంటే నాకు ఈ అవకాశాలు అంత సులభంగా రాలేదు. ఎన్నో కష్టాలు పడితే వచ్చాయి. ఎన్నో అవమానాలు ఎదురయ్యాయి. కొన్ని ఆడిషన్స్‌ వెళ్తే, నటనకు పనికి వచ్చే ముఖమేనా అన్న కామెంట్లు చేశారు’ అని చెప్పింది.

‘ఆడిషన్‌కు వెళ్లిన ప్రతిసారీ కన్నీళ్లతోనే ఇంటికి తిరిగి వచ్చేదాన్ని. ఒక సినిమా కోసమైతే పదే పదే ఆడిషన్‌ చేశారు. ఎట్టకేలకు ఆ మూవీలో ఎంపికయ్యాను. రెండు, మూడు నెలలపాటు ఆ సినిమాకు సంబంధించిన వర్క్‌షాప్స్‌ జరిగాయి. ఆ తర్వాత కొద్దిరోజు?కే ఆ ప్రాజెక్ట్‌ రద్దయింది. ఆ తర్వాత దాదాపు 25కు పైగా ఆడిషన్స్ ఇచ్చా. అవన్నీ రిజెక్ట్‌ చేశారు. నా నటనపై వాళ్లకెప్పుడూ అనుమానం ఉండేది. ఇలాంటి సవాళ్లను ఎన్నో ఎదుర్కొన్నా. అయితే ఎప్పుడూ వెనక్కి తగ్గాలనుకోలేదు. దీంతో నా ప్రతి సినిమాకు నన్ను నేను మెరుగుపరుచుకుంటూ వచ్చా. నేనెప్పుడు నా సినిమాలు చూసినా, ఇంకాస్త బాగా చేస్తే బాగుండేదనుకుంటా’’ అని రష్మిక అన్నారు. ప్రస్తుతం ఆమె చేతిలో భారీ ప్రాజెక్ట్‌లే ఉన్నాయి. అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో రాబోతున్న ‘పుష్ప: ది రైజ్‌’లో రష్మిక బలమైన పాత్ర పోషిస్తోంది. దీంతోపాటు బాలీవుడ్‌లో విక్కీ కౌశల్‌తో ‘చవ్వా’, సల్మాన్‌తో ‘సికిందర్‌’ తదితర చిత్రాల్లో నటిస్తోంది. శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో ‘కుబేర’లోనూ కీలక పాత్ర పోషిస్తోంది.

Updated Date - Aug 12 , 2024 | 08:57 PM