Namrata Shirodkar: ఆదర్శ మహిళా.. ఈ  క్షణాన్ని జీవితంలో మరచిపోలేను!

ABN , Publish Date - Jul 15 , 2024 | 04:59 PM

అనంత్‌ అంబానీ (Anant Ambani) , రాధిక మర్చంట్‌ల వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. జులై 12న జరిగిన ఈ వివాహ వేడుకలో దేశ, విదేశాలకు చెందిన వ్యాపార, రాజకీయ, సినీ తదితర రంగాల ప్రముఖులు పాల్గొన్నారు.

అనంత్‌ అంబానీ (Anant Ambani) , రాధిక మర్చంట్‌ల వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. జులై 12న జరిగిన ఈ వివాహ వేడుకలో దేశ, విదేశాలకు చెందిన వ్యాపార, రాజకీయ, సినీ తదితర రంగాల ప్రముఖులు పాల్గొన్నారు. సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు(Mahesh Babu), తన సతీమణి నమ్రతా శిరోద్కర్‌(Namrata Shirodkar), కుమార్తె సితారతో (Sitara) ఈ వివాహానికి హాజరయ్యారు. అనంత్‌, రాధికల వివాహానికి సంబంధించిన కొన్ని ఆసక్తికర ఫొటోలను ఇన్‌స్టా వేదికగా నమత్ర షేర్‌ చేశారు. వాటిలో ఇన్ఫోసిస్‌ మాజీ ఛైర్‌పర్సన్‌ సుధామూర్తితో (Sudha murthy) కలిసి దిగిన ఫొటో కూడా ఉంది. ‘‘సుధామూర్తి .. ఈ ఆదర్శ మహిళ గురించి వినడమే గానీ ఎప్పుడూ కలవలేదు, తొలిసారి ఇప్పుడే కలిశాను. ఈ క్షణం నా జీవితంలో ఎప్పటికీ మరచిపోలేను. ఆమె మా ముత్తాత, నా భర్త, సితారల గురించి చెబుతుంటే ఆనందంగా అనిపించింది. ఆమె చూపించే అభిమానం ఎప్పటికీ మరువలేనిది’’ అని రాసుకొచ్చారు. వీటితో నటీమణులు నయనతార, జ్యోతిక ఫొటోలను కూడా షేర్‌ చేశారు. 

Updated Date - Jul 15 , 2024 | 05:00 PM