Nagarjuna: తప్పని తేలితే.. మేమే కూల్చేస్తాం

ABN , Publish Date - Aug 24 , 2024 | 01:31 PM

ఎన్ - కన్వెన్షన్  సెంటర్‌ను కూల్చివేయడంపై అక్కినేని నాగార్జున స్పందించారు. ఈ మేరకు ఎక్స్‌లో పోస్ట్‌ పెట్టారు.

ఎన్-కన్వెన్షన్  (N Convention) సెంటర్‌ను కూల్చివేయడంపై అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) స్పందించారు. ఈ మేరకు ఎక్స్‌లో పోస్ట్‌ పెట్టారు. "స్టే ఆర్డర్‌, కోర్టు కేసులకు విరుద్థంగా ఎన్‌ కన్వెన్షన్‌కు సంబంధించి కూల్చివేతలు చేపట్టడం బాధాకరం. మా ప్రతిష్టను కాపాడటం కోసం, కొన్ని వాస్తవాలను తెలియజేయడం కోసం, చట్టాన్ని ఉల్లంఘించేలా మేము ఎటువంటి చర్యలు చేపట్టలేదని తెలియజేయడానికే ఈ ప్రకటన విడుదల చేయడం సరైనదని భావించాను. ఆ భూమి పట్టా భూమి. ఒక్క అంగుళం ట్యాంక్‌ ప్లాన్‌ కూడా ఆక్రమణకు గురికాలేదు. ప్రైవేట్‌ స్థలంలో నిర్మించిన భవనమిది. కూల్చివేత కోసం గతంలో ఇచ్చిన అక్రమ నోటీసుపై  స్టే  కూడా మంజూరు చేయబడింది. స్పష్టంగా చెప్పాలంటే, కూల్చివేత తప్పుడు సమాచారంతో లేదా చట్ట విరుద్ధంగా జరిగింది. ఈరోజు ఉదయం కూల్చివేతకు ముందు మాకు ఎలాంటి నోటీసు జారీ చేయలేదు. కేసు కోర్టులో ఉన్నప్పుడు ఇలా చేయడం సరికాదు. చట్టాన్ని గౌరవించే పౌరుడిగా, కోర్టు నాకు వ్యతిరేకంగా తీర్పునిస్తే కూల్చివేత నేనే నిర్వహించి ఉండేవాడిని. తాజా పరిణామాల వల్ల మేము ఆక్రమణలు చేశామని, తప్పుడు నిర్మాణాలు చేపట్టామని ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్ళే అవకాశముంది. ఆ అభిప్రాయాలను పోగొట్టాలనేదే మా ప్రధాన ఉద్దేశం. అధికారులు చేసిన ఈ చట్ట విరుద్ధ చర్యలకు వ్యతిరేకంగా మేము న్యాయస్థ్థానాన్ని ఆశ్రయిస్తాం. అక్కడ మాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాను’’ అని అన్నారు.  

Updated Date - Aug 24 , 2024 | 02:07 PM