Kirak RP: జగన్ మానసికస్థితిపై ఎర్రగడ్డ‌లో టెస్ట్ చేయాలి.. విజయసాయి రెడ్డి దుర్మార్గుడు!!

ABN , Publish Date - Jul 20 , 2024 | 08:35 PM

ఈ మధ్య జబర్దస్త్‌లో కమెడియన్‌గా చేసిన కిరాక్ ఆర్.పి వీడియోలు ఎలా వైరల్ అవుతున్నాయో తెలియంది కాదు. ముఖ్యంగా వైసీపీ పార్టీని, నాయకుల్ని టార్గెట్ చేస్తూ ఆయన ఇస్తున్న మీడియా సమావేశాలు హాట్‌హాట్ చర్చలకు తావిస్తున్నాయి. శనివారం కిరాక్ ఆర్.పి మరోసారి మీడియా ముందుకు వచ్చి, వైఎస్ జగన్, విజయసాయి రెడ్డిలపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

Kiraak RP

జబర్దస్త్‌లో కమెడియన్‌గా చేసిన కిరాక్ ఆర్.పి (Kiraak RP) వీడియోలు ఈ మధ్య ఎలా వైరల్ అవుతున్నాయో తెలియంది కాదు. ముఖ్యంగా వైసీపీ పార్టీని, నాయకుల్ని టార్గెట్ చేస్తూ ఆయన ఇస్తున్న మీడియా సమావేశాలు హాట్‌హాట్ చర్చలకు తావిస్తున్నాయి. శనివారం కిరాక్ ఆర్.పి మరోసారి మీడియా ముందుకు వచ్చి, వైఎస్ జగన్, విజయసాయి రెడ్డిలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఏమన్నారంటే..

‘‘విజయసాయి రెడ్డి (V Vijaysai Reddy) మీడియాకు క్షమాపణలు చెప్పాలి. ఆ దౌర్బాగ్యుడు పుట్టింది నెల్లూరు జిల్లాలోనే. నెల్లూరు వాసిగా నేను మీడియాకు క్షమాపణలు చెబుతున్నాను. మీడియా కూడా విజయసాయి కామెంట్స్ ముక్తకఠంగా ఖండించాలి.. లేదంటే మీడియానే చులకన అయ్యే అవకాశం ఉంది. ఆంధ్ర రాష్ట్రం కోసం నెల్లూరు వాసి పొట్టి శ్రీరాములు పోరాడారు. పుచ్చలపల్లి సుందరయ్య మా జిల్లా వాసి. దూపకుంట రోశమ్మ మద్యపాన నిషేధం కోసం కృషి చేశారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దేవుడు లాంటి మనిషి. ఇలాంటి గొప్పవారు మా జిల్లాలో పుట్టారు. విజయసాయి రెడ్డి అక్రమార్కుడు దుర్మార్గుడు కూడా అక్కడే పుట్టాడు. మదన్ మోహన్ (Madan Mohan), శాంతి(Santhi)ల వివాదంలో విజయసాయి రెడ్డి డిఎన్ఎ టెస్ట్ (DNA Test) చేయించుకుని తన నిజాయితీని నిరూపించుకోవాలి. మీడియాపై తిట్లు, దేవుడు మీద ఒట్లు వేస్తే విజయసాయి రెడ్టి నిజాయితీ బయట పడదు.

A2గా జైలులో చిప్పకూడు తిన్నాడు. వేంకటేశ్వర స్వామి కొండను నాశనం చేసి.. ఇప్పుడు ఆయన దగ్గర ఒట్లు వేస్తాడంట. శాంతికి కోటి అరవై లక్షలు విజయసాయి రెడ్డి ఎందుకు ఇచ్చాడు? విజయసాయి రెడ్డి గురించి జగన్ ఎందుకు మాట్లాడటం లేదో వివరణ ఇవ్వాలి. వినుకొండ పరామర్శకు పోయి జగన్ అమ్మ ఓడి గురించి మాట్లాడాడు. ఎక్కడ ఏం మాట్లాడాలో తెలీని అజ్ఞాని జగన్ (YS Jagan Mohan Reddy). జగన్‌కు ప్రతిపక్ష హోదా కావాలంటే దానికి తగ్గ సీట్లు రావాలిగా. పర్యటనలో కారు లేదని ఉన్మాదిలా ప్రవర్తించాడు. జగన్ మానసికస్థితిపై ఎర్రగడ్డ‌లో టెస్ట్ చేయాలి. మీడియా ప్రశ్నలకు జగన్ కంగారు పడ్డాడు. జగన్‌కు దమ్ముంటే అసెంబ్లీ‌కి రావాలి. (Kiraak RP Comments on YS Jagan and Vijaysai Reddy)


Vijaysai-reddy-and-Jagan.jpg

కూటమి అధికారంలోకి రాగానే 7 వేలు పింఛన్‌ను చంద్రబాబు (Chandrababu) ఇచ్చారు. కానీ అమ్మఒడి ఇంకా ఇవ్వలేదని జగన్ ఒకటే ఏడుపు. 11 సీట్లు వచ్చినా జగన్‌కు ఇంకా బుద్ది రాలేదు. జగన్‌కు షుగర్ ఏ స్టేజ్‌లో ఉందో మరి. రాష్ట్రాన్ని రావణ కాష్టం చేయాలన్నది జగన్ ఆలోచన. అందుకే అతని నోటి నుంచి మధ్యంతర ఎన్నికలు, రాష్ట్రపతి పాలన అనే పదాలు వస్తున్నాయి. వినుకొండ ఘటనలోని రషీద్, జిలానీ వైసిపి కార్యకర్తలే‌‌. జగన్ గంజాయి వ్యాపారాల వలనే యువత రాక్షసంగా మారిపోయారు. జిలానీ టీడీపీ వారితో కేక్ తిన్న ఫోటోలు చూపిస్తున్నారే.. భారతీ రెడ్డితో ఫోటోలు దిగాడు సునీల్ యాదవ్. వైఎస్ వివేకా హత్య కేసులో సునీల్ ప్రధాన నిందితుడు. మరి వివేకా హత్య చేయించింది భారతీ రెడ్డేనా! నాకు ఉన్న ఇంటలిజెన్స్ సమాచారం ప్రకారం రాష్ట్రంలో గొడవలు సృష్టించడానికి జగన్ బీహార్ నుంచి వేల మంది మనుషుల్ని దింపుతున్నాడు.

నాడు భువనేశ్వరి గారిని అనరాని మాటలు వల్లభనేని వంశీ అంటే జగన్ నవ్వుతూ కూర్చున్నాడు. జగన్‌కు దమ్ముంటే ఇప్పుడు అసెంబ్లీ‌కి వచ్చి మాట్లాడాలి. ఎందుకు జగన్‌కు అసెంబ్లీ అంటే భయం? జగన్.. నీ ఇంట్లో ఆడోళ్లని కూటమి సభ్యులు ఏమి అనరు. నీ అవినీతిపైనే చర్చ ఉంటుంది. భారతీ రెడ్డి పిఏ వర్రా రవీంద్రా రెడ్డి పోస్ట్‌లు నీచాతినీచం. శ్రీ రెడ్డి, పంచ్ ప్రభాకర్ ఏ స్దాయిలో తిట్లు తిట్టారు. వీటి కోసమే జగన్ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు. అయినా కూటమి ప్రభుత్వం మీ ఆడోళ్లని ఏమీ అనదు. (Kirak RP Comments)

వైసీపీ వాళ్లు‌ ఇసుక, కొండలు, రోడ్ల అభివృద్ధి పేరుతో లక్షల కోట్లు కొట్టేశారు. విజయసాయి రెడ్డి వద్ద 5 లక్షల కోట్లు, రోజా దగ్గర 3 వేల కోట్ల బ్లాక్ మనీ ఉంది. వైసీపీలో మంత్రిగా చేసిన ఒకడు పోలవరం అర్థం కాలేదంటాడు. ఇంకొకడు పరిశ్రమల కోసం ఫారిన్ వెళితే పెదాలు పగలుతాయంటాడు. ఇందుకే వైసిపి (YCP) దారుణంగా ఓడింది. జగన్ శవ రాజకీయాలు మాని, అసెంబ్లీ‌కి వచ్చి మాట్లాడాలి..’’ అని కిరాక్ ఆర్పీ ఈ మీడియా సమావేశంలో మాట్లాడారు.

Updated Date - Jul 20 , 2024 | 08:35 PM