Kiraak RP: కొవ్వు కమీషన్‌లో రోజా వాటా ఎంతంటే? లక్ష్మీ పార్వతి బతికుందా?

ABN , Publish Date - Sep 24 , 2024 | 07:50 PM

తిరుమల కొండపై కొలువు తీరిన శ్రీవెంకటేశ్వరుని లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగం జరిగినట్లు ఎన్‌డీడీబీ తన నివేదికలో స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో తీవ్ర దుమారం చెలరేగుతోంది. తాజాగా జబర్ధస్త్ కమెడియన్ కిరాక్ ఆర్పీ మీడియా సమావేశం నిర్వహించి జగన్‌, రోజా, లక్ష్మీ పార్వతి, పొన్నవోలు, ధర్మారెడ్డి వంటి వారందరిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కిరాక్ ఆర్పీ ఏమన్నారంటే..

Kiraak RP

తిరుమల శ్రీవెంకటేశ్వరుని లడ్డూ మహా ప్రసాదం కల్తీ ఘటనపై దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ నడుస్తున్న సంగతి తెలిసిందే. శ్రీవారి భక్తులు, పలు హిందూ సంఘాలు ఈ విషయాన్ని చాలా సీరియస్‌గా తీసుకుని.. ఈ ఘటనకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలంటూ నినాదాలు చేస్తున్నారు. మంగళవారం హైదరాబాద్‌లో ఇదే విషయంపై మీడియా సమావేశం నిర్వహించిన జబర్ధస్త్ కమెడియన్ కిరాక్ ఆర్పీ.. జగన్‌ని మొదలుకుని.. రోజా, లక్ష్మీ పార్వతి, పొన్నవోలు, ధర్మారెడ్డి వంటి వారిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేవలం‌ హిందూమతం నాశనం చేయాలన్నదే జగన్ టార్గెట్‌గా పెట్టుకున్నారని జగన్‌ని ఏకేసిన ఆర్పీ.. ఆ తర్వాత రోజాపై తీవ్ర పదజాలంతో కామెంట్స్ చేశారు. ఆయన మాట్లాడుతూ..

Also Read- Kiraak RP: లడ్డు వివాదం.. వైఎస్ జగన్‌పై కిరాక్ ఆర్పీ సంచలన కామెంట్స్


‘‘రోజా.. వాడిపోయిన రోజా.. ఓడిపోయిన రోజా.. సిగ్గుమాలిన రోజా.. డబ్బుల కోసం దిగజారే రోజా. రోజుకు రూ. 75 లక్షల తిరుమల పేరుతో వచ్చిన డబ్బులను రోజా రెడ్డి, వైవి సుబ్బారెడ్డి పంచుకున్నారు. లడ్డులో వాడిన కొవ్వు కమీషన్‌లో రోజా 15 పర్సెంట్ తీసుకుంది. ఏనాడు రోజా డబ్బులు తీసుకోలేదని చెప్పలేదు. లడ్డుపై రోజా పోల్ పెడితే..‌ జగన్‌దే తప్పు అని జనాలు చాచి కొట్టారు.‌ చంద్రబాబు నాయుడు ప్రజా నాయకుడు. హత్యా రాజకీయాలు చేయాల్సిన అవసరం ఆయనకు లేదు. విజయవాడ ప్రజల కోసం చంద్రబాబు ఎంతో సేవ చేశారు. వైసీపీ వాడు ఒక్కడైనా అక్కడ సేవ చేశాడా?


roja-and-Lakshmi-Parvathi.jpg

ఇక లక్ష్మీ పార్వతి విషయానికి వస్తే.. లక్ష్మీ పార్వతి ఇంకా బతికుందని నాకు తెలీదు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చి జగన్ వైఎస్ఆర్ పేడితే లక్ష్మీ పార్వతీ ఏం చేసింది? అప్పుడు తాగి నిద్రపోయింది. అలాంటిది లడ్డు గురించి లక్ష్మీ పార్వతి ఏదేదో మాట్లాడుతుంది. లడ్డూలోకి ఎలా వస్తుంది కొవ్వు అంటోంది లక్ష్మీ పార్వతి. ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీ పార్వతి ఎలా అక్రమంగా వచ్చిందో.. లడ్డూలోకి జంతువు కొవ్వు కూడా అలాగే వచ్చింది. లక్ష్మీ పార్వతి పదవుల కోసం ఆరాటపడే మనిషి. నన్ను నమ్ముకో.. అంతా అమ్ముకో తరహా వ్యక్తిత్వం లక్ష్మీ పార్వతిది.


Also Read- Hero Karthi పవన్‌ స్వీట్‌ వార్నింగ్‌కు కార్తి స్పందన

పొన్నవోలు సుధాకర్ ఓ గాడిద. మనిషి కాదు పశువు. పొన్నవోలు పద్దతి పాడు లేకుండా హిందువుల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడుతున్నాడు. కాస్ట్ లీ అని అన్నం కాకుండా పందిపెంట తినేరకం పొన్నవోలు. కాస్ట్ లీ విషం ఇస్తాం.. తాగి చావు. వెంకన్న స్వామి కోసం రాజు, పేద అని తేడా లేకుండా దర్శనం కోసం వస్తుంటే.. అడ్డంగా సంపాదించిన వైసీపీ వాళ్లు అక్రమాలకు పాల్పడ్డారు. ఆ స్వామి చూస్తూ ఊరుకోరు. అందుకు ఉదాహరణ ధర్మారెడ్డి. ధర్మారెడ్డి ధర్మంగా లేడు కాబట్టే కొడుకు చనిపోయాడు. ఆ మైలు ఉండగానే ధర్మారెడ్డి కొండపైకి వచ్చేశాడు. మతాలకు అతీతంగా వెంకన్న స్వామిని కొలవటం మనమంతా చూశాం. అహంకారం కొవ్వు పట్టిన వాళ్లే ఇతర మతాల విశ్వాసాలను డామేజ్ చేయాలని చూస్తారు..’’ అని ఆర్పీ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Also Read- Pawan Vs Prakash Raj: పవన్‌కల్యాణ్‌కు ప్రకాశ్‌రాజ్‌ కౌంటర్‌

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Sep 24 , 2024 | 07:55 PM