Game Changer Update: శంకర్ లేకపోయినా షూటింగ్ ఆగలేదు

ABN , Publish Date - Jun 26 , 2024 | 05:25 PM

డైరెక్టర్ శంకర్ ప్రస్తుతం కమల్ హాసన్ తో చేసిన 'భారతీయుడు 2' ప్రచారాల్లో భాగంగా బిజీగా వున్నారు. రామ్ చరణ్ తో 'గేమ్ చెంజర్' సినిమా కూడా శంకర్ చేస్తున్నారు, కానీ శంకర్ ఆ సినిమా ప్రచారాల్లో ఉంటూ ఉండగానే, ఇంకోపక్క 'గేమ్ చెంజర్' చిత్రీకరణ కూడా నడుస్తోంది, అదెలా అంటే...

Game Changer Update: శంకర్ లేకపోయినా షూటింగ్ ఆగలేదు
Ram Charan, Director Shankar, Dil Raju

డైరెక్టర్ శంకర్, రామ్ చరణ్ కాంబినేషన్ లో ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న 'గేమ్ చెంజర్' సినిమా చిత్రీకరణ ప్రస్తుతం జరుపుకుంటోంది. ఈ సినిమా చిత్రీకరణ మొదలై ఇప్పటికి రెండు సంవత్సరాలకి పైగా అవుతోంది, కానీ ఇంకా పూర్తి కాలేదు. దర్శకుడు శంకర్ ఇదే సమయంలో కమల్ హాసన్ తో 'భారతీయుడు 2' సినిమా కూడా చిత్రీకరణ పూర్తి చెయ్యాల్సి వుంది, అందుకని ఈ సినిమా కొంచెం డిలే అయిందని తెలుస్తోంది. (Director Shankar is busy with Bharatheeyudu 2 promotions, but at the same time his other film Game Changer with Ram Charan, shooting is also going on)

gamechanger3.jpg

ప్రస్తుతం దర్శకుడు శంకర్ 'భారతీయుడు 2' ప్రచారాల్లో భాగంగా చాలా బిజీగా వున్నారు. ఆ ప్రచారాలు అయ్యాక మళ్ళీ 'గేమ్ చెంజర్' సినిమా చిత్రీకరణకు వస్తారు అని తెలిసింది. అయితే శంకర్ లేకపోయినా, ఆ సినిమా చిత్రీకరణ మాత్రం ఆగలేదు అని కూడా తెలిసింది. ప్రతి పెద్ద సినిమాకి కొంతమంది సెకండ్ యూనిట్ దర్శకులు వుంటారు. దర్శకుడు ఒకపక్క, సెకండ్ యూనిట్ దర్శకుడు ఇంకోపక్క కొన్ని సన్నివేశాలు చిత్రీకరిస్తారు. అదేమీ కొత్త విషయం కాదు, కానీ ఇక్కడ శంకర్ లాంటి పెద్ద దర్శకుడు వున్నారు కాబట్టి, సెకండ్ యూనిట్ దర్శకుడిగా ఎవరిని పెట్టుకున్నారో తెలుసా. (Sailesh Kolanu is working as the second unit director for Shankar's 'Game Changer' and he is directing some important scenes at present)

saileshkolanu.jpg

'హిట్' తరువాత ఆ సినిమా సీక్వల్ తో విజయాలు సాధించిన శైలేష్ కొలను ఈ సినిమాకి సెకండ్ యూనిట్ దర్శకుడిగా పని చేస్తున్నట్టుగా తెలిసింది. ఇతని దర్శకత్వంలో సీనియర్ నటుడు శ్రీకాంత్, మరికొంతమంది నటులపై కొన్ని సన్నివేశాలు చిత్రీకరిస్తున్నట్టుగా తెలిసింది. గత రెండు రోజుల్లో ఈ చిత్రీకరణ రాత్రిపూట జరిగిందని, ఇది ఇంకా కొనసాగుతోందని తెలుస్తోంది. శంకర్ తన సినిమా 'భారతీయుడు 2' ప్రచారాలు చేసి వచ్చేసరికి శైలేష్ కొలను కొన్ని సన్నివేశాలు చిత్రీకరిస్తారని తెలుస్తోంది.

ఈ సినిమాలో రామ్ చరణ్ కేవలం నాలుగు రోజులు చిత్రీకరణ చేస్తే చాలు సినిమా పూర్తయిపోతుందని తెలుస్తోంది. దానికోసం మళ్ళీ రాజమండ్రి వెళ్ళవలసి వస్తుందని కూడా సమాచారం. ఆగస్టుకి ఈ సినిమా చిత్రీకరణ పూర్తయిపోతుందని తెలుస్తోంది. ఈ సినిమాలో కియారా అద్వానీ, అంజలి కథానాయికలుగా నటిస్తున్నారు. చాలామంది క్యారెక్టర్ నటులు ఈ సినిమాలో వున్నారు.

Updated Date - Jun 26 , 2024 | 06:01 PM