Bigg Boss 8: బిగ్‌'బాస్' ట్విస్ట్.. బిగ్‌'డ్రామా'

ABN , Publish Date - Oct 04 , 2024 | 01:15 PM

Bigg Boss Telugu Season 8: బిగ్‌బాస్ సీజన్ 8లో కంటెస్టెంట్స్‌కి పెద్ద షాకిచ్చాడు బిగ్‌బాస్. మిడ్ వీక్ ఎలిమినేషన్ అంటూ కంటెస్టెంట్స్‌కి బిగ్ ఝలక్ ఇచ్చాడు. ఈ ఘటన తప్పకుండ మణికంఠ నెక్స్ట్ వీక్ నామినేషన్‌కి దారితీస్తుందంటూ కామెంట్ చేస్తున్నారు.

ADITYA OM

బిగ్‌బాస్ సీజన్ 8లో కంటెస్టెంట్స్‌కి పెద్ద షాకిచ్చాడు బిగ్‌బాస్. కంటెస్టెంట్స్ అందరు తమ పనుల్లో తాము బిజీగా ఉండగా బిగ్‌బాస్ డేంజర్ లైట్స్‌తో సైరన్ మోగించాడు. మిడ్ వీక్ ఎలిమినేషన్ అంటూ కంటెస్టెంట్స్‌కి బిగ్ ఝలక్ ఇచ్చాడు. మరోవైపు మణికంఠ ఎవరు ఊహించని విధంగా అందరికి షాకిచ్చాడు. దీంతో హౌజ్‌లో నాటకీయ పరిణామాలు ఏర్పడాయి. సీజన్ ఆరంభంలో నాగ్ చెప్పినట్లే బిగ్‌బాస్ సర్ప్రైజ్ లతో కంటెస్టెంట్స్ కి చుక్కలు చూపిస్తున్నాడు.


గురువారం రాత్రి జరిగిన ఎపిసోడ్‌లో "అందరూ తక్షణమే గార్డెన్ ఏరియాకి రండి.. ఇదొక లిమిట్ లెస్ సర్ప్రైజెస్ సీజన్.. అందులోనుంచి మీరు ఒక పెద్ద సర్ప్రైజ్ ను ఇప్పుడు చూడబోతున్నారు.. ప్రతిరోజులానే మొదలైన ఈరోజు మీలో ఒకరికి మాత్రం పీడకలగా మారబోతుంది.. మణికంఠ, నైనిక, విష్ణుప్రియ, నబీల్, నిఖిల్, ఆదిత్య మీరు ఈ వారం ఇంటి నుంచి బయిటికి వెళ్లడానికి నామినేట్ అయ్యారు.. మీలో నుంచి ఒకరు కాసేపట్లో ఇంటి నుంచి బయటికి వెళ్లబోతున్నారు.. ఈరోజు రాత్రి జరగబోతున్న ఎవిక్షన్‌లో ఇప్పటివరకూ ఉన్న ఓటింగ్ రిపోర్ట్స్ ప్రకారం నిఖిల్, నబీల్, మణికంఠ మీరు ఈరోజుకి సేఫ్‌గా ఉన్నారు.." అంటూ కంటెస్టెంట్స్‌కి షాకిచ్చాడు.


దీంతో ఒక్కసారిగా షాకైన కంటెస్టెంట్స్ ఎమోషనల్ అయ్యారు. ఇక యష్మీ.. మణికంఠ ఎలా సేఫ్ అయ్యాడన్నట్లు ఒక ఎక్స్‌ప్రెషన్ ఇచ్చేసింది. అనంతరం బిగ్‌బాస్ 'ఆదిత్య, విష్ణుప్రియ, నైనిక మీలో ఒకరు ఈ రాత్రికి ఇంటిని వదిలి వెళ్లనున్నారు.. మీ ముగ్గురు మీ బ్యాగ్స్ సర్దుకొని ఇంటి సభ్యులందరికీ మీ వీడ్కోలు చెప్పి సిద్ధంగా ఉండండి." అంటూ సెకండ్ షాక్ ఇచ్చాడు. దీంతో మిగిలిన కంటెస్టెంట్స్ ముగ్గురిని ఓదార్చి దైర్యం చెప్పారు. ఎమోషనల్ అయిన ఆదిత్య ఆప్యాయంగా మణికంఠకి నుదుటిపై ముద్దిస్తూ.. 'చెప్పాను కదా మణి.. నువ్వు సేఫ్.. ఆడియన్స్‌కి నువ్వుంటే చాలా ఇష్టంరా' అంటూ లగేజ్ ప్యాక్ చేసుకున్నాడు. తర్వాత విష్ణుప్రియ కూడా లగేజ్ సదురుకుంటుండగా నైనిక మాత్రం నేను ప్యాక్ చేసుకోను.. అసలు ఇలా ఎలా పంపిస్తారు బిగ్‌బాస్ అంటూ హైరానా చేసింది.


అనంతరం బిగ్‌బాస్ ఎగ్జిట్ గేట్ వద్ద రెడ్ లైన్స్ ఏర్పాటు చేశాడు. ఎలిమినేషన్‌లో ఉన్న ముగ్గురు కంటెస్టెంట్స్‌ని మెయిన్ డోర్ వైపు తిరిగి నిల్చోమని ఆదేశాలిచ్చాడు. ఇక మిగతా సభ్యులని ఈరోజు ఇంట్లో నుండి ఎవరు బయటకెళేళ్తారని అనుకుంటున్నారో అభిప్రాయాలతో పాటు కారణాలు తెలియజేయమన్నాడు. మొదటగా నిఖిల్.. ఆదిత్యని దగ్గరకి తీసుకొని 'అన్నకి ఉన్న స్ట్రెంథ్ మేము ఇప్పుడే చూశాం.. ఇంకా స్ట్రాంగ్‌గా ఆడాలని కోరుకుంటున్నాం.. కొన్ని విషయాల్లో వెనకబడుతున్నాడని అనిపించింది' అంటూ తన ఒపీనియన్ షేర్ చేశాడు. ఆ తర్వాత మణికంఠను పిలిచాడు బిగ్‌బాస్. వెంటనే ఒక అయోమయం ఎక్స్‌ప్రెషన్‌తో ఆదిత్య పక్కకెళ్లి నిల్చున్నాడు. దీంతో హౌజ్ మేట్స్‌తో సహా ఆడియెన్స్ కూడా షాక్ అయ్యారు. మణికంఠని ఎంతో ఆప్యాయంగా చూసుకున్న ఆదిత్య పక్కకెళ్లి నిల్చోవడంతో ఆడియెన్స్ మణికంఠపై మండిపడుతున్నారు. ఈ ఘటన తప్పకుండ మణికంఠ నెక్స్ట్ వీక్ నామినేషన్‌కి దారితీస్తుందంటూ కామెంట్ చేస్తున్నారు. నెక్స్ట్ నబీల్.. విష్ణుప్రియ పేరు చెప్పగా.. ప్రేరణ, పృథ్వీ.. నైనికను ఎలిమినేట్ అవుతారని తమ అభిప్రాయాలు చెప్పారు. తర్వాత సీత, యష్మీ ఇద్దరూ ఆదిత్య ఎలిమినేట్ కావాలని కోరారు. ఇలా హౌస్‌లో నలగురు ఆదిత్య ఎలిమినేట్ కావాలన్నారు. తర్వాత 'మీరు మీ అభిప్రాయాన్ని చెప్పారు కానీ ఓటింగ్ రిపోర్ట్స్ ప్రకారం ఇంటి నుంచి బయటికి వెళ్లాల్సింది మాత్రం ఆదిత్య' అంటూ బిగ్‌బాస్ అనౌన్స్ చేశాడు. దీంతో ఆదిత్య 'ఐ లవ్ యూ అల్' అంటూ అందరికి బై చెప్పి బయటకొచ్చేసాడు. ఆదిత్య ఎవికెట్ అయిన వారాంతరంలో మరో ఎలిమినేషన్ కొనసాగుతుందని బిగ్‌బాస్ మరో బాంబ్ పేల్చాడు.

మరిన్ని వార్తల కోసం చదవండి..

Updated Date - Oct 04 , 2024 | 01:15 PM