Anasuya Controversy: అనసూయకి వార్తల్లో ఉండటం ఇష్టమా, అందుకనే వివాదాలు ?

ABN , Publish Date - Jul 24 , 2024 | 12:25 PM

అనసూయ రాగానే బ్రేకింగ్ న్యూస్ ఉంటుంది అని అందరూ అనుకుంటారు అని ఆమె చెప్పింది. అయితే ఈసారి ఏమీ మాట్లాడాను అని చెపుతూనే అనసూయ చాలా మాట్లాడింది.

Anasuya

'చాలా రోజులైంది. అందరికీ పెడర్ధాలు తీయడం అలవాటైపోయింది. అప్పుడు బిజీగా వున్నాను అంటే, ఇప్పుడు బేవార్స్ గా వున్నాను అని కాదు అర్థం. చాలామంది నేనొచ్చాను అంటే నవ్వుతూ వెల్కమ్ చెప్పారు, నేను వస్తున్నాను అంటే ఎదో బ్రేకింగ్ న్యూస్ ఉంటుంది అనుకుంటారు, కానీ ఈరోజు అందరూ నిరాశ పడ్డారు' అని చెప్పింది అనసూయ తన స్పీచ్ మొదలుపెట్టి. 'సింబా' ట్రైలర్ విడుదల ఫంక్షన్ లో అనసూయ ఈరోజు పాల్గొని, ఈ వ్యాఖ్యలు చేసింది. అంటే ఆమె వస్తే చాలు, వివాదాలు వస్తాయని ఆమె అనుకుంటోంది, అలా ఆమె వార్తల్లో ఉండాలని అనుకుంటుందేమో అని ఆమె అనుకుంటోంది.

నేను చాలా రోజులైంది మీడియా ముందుకు వచ్చి, నేను మాట్లాడటం మర్చిపోయాను, కొంతమంది సన్నిహితులు నాకు మంచి చెడ్డలు చెప్పడంతో మీరు ఏదైనా అడిగితేనే నేను మాట్లాడాలి అనుకున్నాను. నాకు చాలా చెప్పాలని వుంది, అన్నీ మాట్లాడాలి అనుకుంటాను, కానీ ఆలా చెప్పడంలో ఏదేదో మాట్లాడేస్తూ వుంటాను. కానీ ఈసారి మీరు ఏదైనా అడిగితే మాట్లాడాలి అని మాత్రమే అనుకుంటున్నాను, అని చెప్పారు అనసూయ.

anasuyacontroversyone.jpg

ఈ 'సింబా' సినిమా ఒప్పుకోవడానికి ప్రధాన కారణం, 'ఈ సినిమా కథ నచ్చడమే అని' చెప్పింది అనసూయ. ఇందులో యాక్షన్ సన్నివేశాలున్నాయి, అలాగే ఇలాంటి పాత్ర ఇంతకు ముందు చెయ్యలేదు, ఈ పాత్ర నటన పరంగా ఛాలెంజ్ వుండింది అని చెప్పింది అనసూయ. సినిమాలో విజయ్ దేవరకొండ లాంటి మొగుడొస్తాడు అని డైలాగ్ పెట్టారు కదా, మీ ఇద్దరి మధ్యలో గొడవలు సాల్వే అయిపోయినట్టేనా అని అడిగితే, 'అది అంత పెద్ద విషయం కాదు' అని చెప్పారు. కొన్నిసార్లు కొందరు మితిమీరినప్పుడు ప్రశ్నించాను, కానీ 'నేను అప్పుడు ఆ సమయంలో నేను అడిగినప్పుడు మీడియా వాళ్ళు ఎవరూ ఎందుకు అతన్ని ప్రశ్నించలేదు' అని అడిగింది అనసూయ. 'కావాలనే మా దర్శకుడు అడిగారు, నాకేమీ ఎవరిపైన కోపం లేదు, అందరూ నవ్వుకున్నారు కదా, అదే కావాల్సింది' అని చెప్పారు అనసూయ.

Updated Date - Jul 24 , 2024 | 12:25 PM