Mathu Vadalara 2: ప్రభాస్‌ వదిలిన ‘మత్తు వదలరా 2’ ట్రైలర్‌

ABN , Publish Date - Sep 08 , 2024 | 11:32 AM

శ్రీసింహా (Sri Simha) హీరోగా నటించిన చిత్రం ‘మత్తు వదలరా 2’ (Mathu Vadalara 2). రితేశ్‌ రానా (Ritesh Rana0 దర్శకత్వంలో కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కింది.


శ్రీసింహా (Sri Simha) హీరోగా నటించిన చిత్రం ‘మత్తు వదలరా 2’ (Mathu Vadalara 2). రితేశ్‌ రానా (Ritesh Rana) దర్శకత్వంలో కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కింది. ఫరియా అబ్దుల్లా, సత్య కీలక పాత్రధారులు. ‘మత్తు వదలరా’కు కొనసాగింపుగా  ఈ చిత్రం రాబోతుంది. సెప్టెంబర్‌ 13న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఆదివారం ఈ సినిమా ట్రెలర్‌ను ప్రభాస్‌ విడుదల చేశారు. శ్రీసింహా యాక్టింగ్‌.. సత్య కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకునేలా ట్రైలర్‌ ఉంది. ఐ యామ్‌ ఆఫీసర్‌ ఆఫ్‌ లా.. బట్‌ ఐ యామ్‌ నాట్‌ యువర్‌ సన్‌ ఇన్‌లా’ అంటూ సునీల్‌, సత్యల మధ్య సాగే సంభాషణలు ఆకట్టుకుంటున్నారు. కాలభైరవ సంగీతం అలరిస్తుంది. 

Updated Date - Sep 08 , 2024 | 06:35 PM