Thandel: ఫిల్మ్‌సిటీలో కీలక సన్నివేశాల చిత్రీకరణలో..

ABN , Publish Date - Jul 18 , 2024 | 10:15 AM

నాగచైతన్య(Naga Chaitanya), లేడీ పవర్‌స్టార్‌ సాయి పల్లవి (Sai pallavi)రెండోసారి తెరపై సందడి చేయడానికి సిద్ధమయ్యారు. వీరిద్దరూ జంటగా 'తండేల్‌' (Thandel) సినిమా తెరకెక్కుతోంది.


నాగచైతన్య(Naga Chaitanya), లేడీ పవర్‌స్టార్‌ సాయి పల్లవి (Sai pallavi)రెండోసారి తెరపై సందడి చేయడానికి సిద్ధమయ్యారు. వీరిద్దరూ జంటగా 'తండేల్‌' (Thandel) సినిమా తెరకెక్కుతోంది. చందు మొండేటి దర్శకుడు. అల్లు అరవింద్‌ సమర్పణలో బన్నీ వాస్‌ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ రామోజీ ఫిల్మ్‌సిటీలో జరుగుతోంది. ప్రధాన పాత్రధారులపై కీలకమైన టాకీ పార్టును తెరకెక్కిస్తున్నారు.

Sai.jpg

ఉత్తరాంధ్ర నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో నాగచైతన్య, సాయిపల్లవి డీగ్లామర్‌ పాత్రల్లో నటిస్తున్నారు. పాత్రలు వేషం, సంభాషణలు అత్యంత సహజంగా ఉంటాయని, భారీ హంగులతో రూపొందుతున్న ఈ చిత్రం ప్రేక్షకులకు సరికొత్త అనుభూతి పంచుతుందని సినీ వర్గాలు తెలిపాయి. ‘విరాటపర్వం’, ‘గార్గి’ చిత్రాల్లో నటనకుగానూ ఉత్తమ నటిగా రెండు ఫిల్మ్‌ఫేర్‌ పురస్కారాల్ని సొంతం చేసుకున్నారు సాయిపల్లవి. ఈ సందర్భంగా ఆమెని ‘తండేల్‌’ సినిమా సెట్లో ఆ చిత్రబృందం సత్కరించింది.

Updated Date - Jul 18 , 2024 | 10:15 AM