Tollywood Producers - Pawan kalyan: చిరునవ్వుతో ఆహ్వానం.. పరిశ్రమ బాగోగుల గురించి చర్చ..
ABN , Publish Date - Jun 24 , 2024 | 03:33 PM
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం (Ap Deputy Cm) పవన్ కల్యాణ్ను (Pawan kalyan) టాలీవుడ్ అగ్ర నిర్మాతలు కలిశారు. ప్రత్యేక విమానంలో గన్నవరం చేరుకున్న నిర్మాతల బృందం విజయవాడలోని క్యాంప్ ఆఫీసులో పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యారు. దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నా
![Tollywood Producers - Pawan kalyan: చిరునవ్వుతో ఆహ్వానం.. పరిశ్రమ బాగోగుల గురించి చర్చ..](https://media.chitrajyothy.com/media/2024/20240615/Pk_85a74fb92f_v_jpeg.webp)
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం (Ap Deputy Cm) పవన్ కల్యాణ్ను (Pawan kalyan) టాలీవుడ్ అగ్ర నిర్మాతలు కలిశారు. ప్రత్యేక విమానంలో గన్నవరం చేరుకున్న నిర్మాతల బృందం విజయవాడలోని క్యాంప్ ఆఫీసులో పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యారు. దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తను ఎంతగానో ప్రేమించే తెలుగు చిత్ర పరిశ్రమ పెద్దల్ని పవన్ ఆత్మీయంగా తన ఛాంబర్లోకి ఆహ్వానించారు. తదుపరి నిర్మాతల బృందం పవన్ కు (Producers) శుభాకాంక్షలు తెలిపారు.
చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలు, రాష్ట్రంలో సినిమా రంగం అభివృద్థికి ఉన్న అవకాశాలు, ఏపీలో సినీ రంగం విస్తరణకు ఉన్న అవకాశాలపై చర్చించారని, సినీ పరిశ్రమ ఇబ్బందులను ఉప ముఖ్యమంత్రి ముందు ఉంచారని తెలిసింది. ఈ సమావేశంలో రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ కూడా ఉన్నారు.
అల్లు అరవింద్, సి అశ్వినీదత్, ఏ.ఎం. రత్నం, ఎస్.రాధాకృష్ణ (చినబాబు), దిల్ రాజు, బోగవల్లి ప్రసాద్, డి.వి.వి.దానయ్య, వై సుప్రియ, ఎన్.వి.ప్రసాద్, బన్నీ వాసు, నవీన్ ఎర్నేని, నాగవంశీ, టి.జి.విశ్వప్రసాద్, యు.వి క్రియేషన్స వంశీ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
తొలి హీరోయినను కలిసిన వేళ...
పవన కల్యాణ్ హీరోగా పరిచయమైన చిత్రం ుఅక్కడ అమ్మాయి.. ఇక్కడ అబ్బాయి’ ఆ చిత్రంతో నాగార్జున మేన కోడలు సుప్రియ కథానాయికగా పరిచయమైంది. ఎన్నో ఏళ్ల తర్వాత పవనను కలిశారు సుప్రియ. ఆమె స్టూడియో సెక్టర్కు ప్రెసిడెంట్గా ఉన్నారు.