Santosh shoban: యూవీలో.. ముచ్చటగా మూడోసారి

ABN , Publish Date - Jul 12 , 2024 | 02:04 PM

సంతోష్‌ శోభన్  (Santosh shoban)కెరీర్‌ బిగినింగ్‌ నుంచి వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. సాలీడ్‌ హిట్‌ లేకపోయినా ఖాళీగా మాత్రం లేరు. సినిమా, వెబ్‌ సిరీస్‌లు అంటూ బిజీగానే ఉన్నారు.


సంతోష్‌ శోభన్  (Santosh shoban)కెరీర్‌ బిగినింగ్‌ నుంచి వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. సాలీడ్‌ హిట్‌ లేకపోయినా ఖాళీగా మాత్రం లేరు. సినిమా, వెబ్‌ సిరీస్‌లు అంటూ బిజీగానే ఉన్నారు. పెద్ద పెద్ద బ్యానర్లలో సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్‌ హోం బ్యానర్‌ అయిన యూవీ క్రియేషన్‌లో (Uv Creations) సంతోష్‌ ఎక్కువగా సినిమాలు చేస్తున్నాడు. ‘ఏక్‌ మినీ కథ’ ఆ సంస్థలో చేసిన సినిమానే. ఈ సినిమా ఓటీటీలో విడుదలై మంచి విజయాన్ని అందుకొంది. ఆ తరవాత ‘కల్యాణం కమనీయం’ కూడా అదే సంస్థలో చేశారు. ఇప్పుడు మరోసారి యూవీ సంస్థలో సినిమా చేయబోతున్నారు. ఈ బ్యానర్‌లో ఇది ముచ్చటగా మూడో సినిమా ఇది. శనివారం సంతోష్‌ శోభన పుట్టిన రోజు సందర్భంగా యూవీ క్రియేషన్స్‌ ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన విడుదల చేయబోతోంది. నూతన దర్శకుడు అశ్విన్‌ దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమాలో మిస్‌ ఇండియా మానస వారణాసి కథానాయికగా నటిస్తోంది. ఇది తనకు రెండో సినిమా. అశోక్‌ గల్లా హీరోగా నటిస్తున్న ‘దేవకీ నందన వాసుదేవ’లో ఆమె కథానాయిక. ఆ సినిమా సెట్స్‌పై ఉండగానే మరో ఆఫర్‌ అందుకొంది.  ఇతర విషయాలు త్వరలో వెల్లడిస్తారు. 

Updated Date - Jul 12 , 2024 | 02:06 PM