Sai Durgah Tej: పుష్ప రాజ్ గురించి సాయి దుర్గా తేజ్ ఏమన్నాడంటే..
ABN , Publish Date - Dec 04 , 2024 | 02:53 PM
ఎట్టకేలకు మెగా, అల్లు ఫ్యామిలీల మధ్య ఏర్పడిన గ్యాప్ తగ్గుతున్నట్లు కనిపిస్తోంది. 'పుష్ప 2' రిలీజ్ ముందు ఈ వార్త మెగా, అల్లు మ్యూచ్వల్ ఫ్యాన్స్ని ఉబ్బి తబ్బిపోయేలా చేస్తోంది. ఇంతకీ ఏమైందంటే..
ఏపీ ఎన్నికల తర్వాత నుండి తెలుగు రాష్ట్రాల్లో మెగా వర్సెస్ అల్లు(Mega Vs Allu) అనే టాపిక్ సోషల్ మీడియా మాధ్యమాల్లో రచ్చగా మారింది. మెగా, అల్లు ఫ్యామిలీల మధ్య గ్యాప్ పెరిగిందని ఫ్యాన్స్ కూడా రెండు వర్గాలుగా విడిపోయి కొట్టుకున్నారు. ఈ తరుణంలోనే బన్నీ 'పుష్ప 2' సినిమా రిలీజ్ ఉండటంతో సోషల్ మీడియాలో మరింత రచ్చ జరుగుతోంది. 'పుష్ప 2' సినిమాపై ఏ మెగా హీరో కూడా స్పందించకపోవడంతో కొందరు మెగా ఫ్యాన్స్ ఈ సినిమాని అవాయిడ్ చేసేందుకు సిద్ధపడ్డారు. ఈ క్రమంలోనే మెగా హీరో సాయి దుర్గా తేజ్ ట్వీట్ వైరల్గా మారింది. ఇంతకీ ఆయన ఏమన్నాడంటే..
'పుష్ప 2' రిలీజ్ నేపథ్యంలో సాయి దుర్గా తేజ్ ట్వీట్ చేస్తూ.. పుష్ప టీమ్కి శుభాకాంక్షలు తెలియజేశాడు. అలాగే 'సెండింగ్ మై హార్ట్ఫెల్ట్ విషెస్ టూ' అంటూ అల్లు అర్జున్, సుకుమార్, దేవి శ్రీ ప్రసాద్, ఫహద్ ఫాసిల్, రష్మిక మందన్న, రసూల్ పూకుట్టి, మైత్రీ, సుకుమార్ నిర్మాణ సంస్థలను ట్యాగ్ చేశాడు. దీంతో మెగా, అల్లు మ్యూచ్వల్ ఫ్యాన్స్ తెగ ఖుషి అవుతున్నారు. ఇప్పటికైనా మెగా, అల్లు గొడవలు సర్దుకొని అందరు ఒకటి కావాలని కోరుకుంటున్నారు.
మరికొన్ని గంటల్లో ‘పుష్ప2’ ఆరు భాషల్లో ప్రపంచవ్యాప్తంగా 12 వేల థియేటర్లలో విడుదల కానుంది. ‘‘అత్యధిక థియేటర్లలో ఐమాక్స్ ఫార్మాట్లో విడుదలవుతున్న భారతీయ చిత్రమిది. సినీడబ్స్ యాప్ సహాయంతో ఏ భాషతోనైనా ఈ సినిమాని చూసే అవకాశం ఉందని నిర్మాతలు చెప్పారు.