Ram Charan: దేశంలోనే రెండో కారు... వీడియో వైరల్‌

ABN , Publish Date - Jul 11 , 2024 | 05:14 PM

అనంత్‌ అంబానీ-రాధికా మర్చెంట్‌ల వివాహానికి సినీ, రాజకీయ ప్రముఖులు తరలి వెళ్తున్నారు. ఈ క్రమంలో గ్లోబల్‌స్టార్‌ హీరో రామ్‌చరణ్‌ (Ram Charan) దంపతులు కూడా ముంబయి బయలుదేరి వెళ్లారు.

అనంత్‌ అంబానీ-రాధికా మర్చెంట్‌ల వివాహానికి సినీ, రాజకీయ ప్రముఖులు తరలి వెళ్తున్నారు. ఈ క్రమంలో గ్లోబల్‌స్టార్‌ హీరో రామ్‌చరణ్‌ (Ram Charan) దంపతులు కూడా ముంబయి బయలుదేరి వెళ్లారు. సంగీత్ కి  కూడా వెళ్లారుగా ఇందులో పెద్ద విశేషం ఏముంది అనుకుంటున్నారా? హైదరాబాద్‌లోని ఇంటి నుంచి బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు సతీమణి ఉపాసన కుమార్తె క్లీంకారతో కలిసి రామ్‌చరణ్‌ తన కొత్త రోల్స్‌ రాయిస్‌ స్పెక్టార్‌ను డ్రైవ్‌ (Rolls-Royce Spectre)చేసుకుంటూ వచ్చారు. దాదాపు రూ.9 కోట్లకు పైగా ఖరీదైన కారు అది. ఇక ఆన్ రోడ్‌ కాస్ట్‌ అయితే ఇంకా ఎక్కువే ఉంటుంది. భారతదేశంలో ఉన్న రెండోది కావడం గమనార్హం. ప్రస్తుతం ఈ విజువల్స్‌ నెట్టింట విపరీతంగా వైరల్‌ అవుతున్నాయి. 

ఈ కారు జనవరిలో లాంచ్ కాగా, అప్పుడే చరణ్‌ కారును బుక్‌ చేశారు. ఈ మధ్యనే ఈ కార్‌ డెలివరీ అయింది. రామ్‌చరణ్‌, శంకర్‌ దర్శకత్వంలో గేమ్‌ ఛేంజర్‌ (Game Changer) చిత్రంలో నటిస్తున్నారు. ఇంకో 20 రోజులు షూటింగ్‌ చేస్తే ఆ సినిమా పూర్తవుతుందని ఇటీవల శంకర్‌ చెప్పారు. ఇందులో కియారా అడ్వాణీ కథానాయిక. దిల్‌ రాజు ఈ చిత్రానికి నిర్మాత. తదుపరి బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ఓ చిత్రంలో నటించబోతున్నారు. ఇందులో శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్‌ కథానాయికగాగా నటిస్తోంది. ఆగస్ట్‌ నుంచి ఈ సినిమా సెట్స్‌ మీదకు వెళ్లే అవకాశం ఉంది. 

Updated Date - Jul 11 , 2024 | 05:17 PM