లావణ్యపై రాజ్‌తరుణ్‌ తల్లిదండ్రులు ఫిర్యాదు!

ABN , Publish Date - Aug 02 , 2024 | 01:04 AM

లావణ్యపై నటుడు రాజ్‌ తరుణ్‌ తల్లిదండ్రులు మాదాపూర్‌ పోలీస్‌  స్టేషన్లో   గురువారం ఫిర్యాదు చేశారు. బుధవారం రాత్రి ఇంటి దగ్గర ఉండగా దాడికి ప్రయత్నించిందని,

లావణ్యపై నటుడు రాజ్‌ తరుణ్‌ తల్లిదండ్రులు మాదాపూర్‌ పోలీస్‌  స్టేషన్లో   గురువారం ఫిర్యాదు చేశారు. బుధవారం రాత్రి ఇంటి దగ్గర ఉండగా దాడికి ప్రయత్నించిందని, తమకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయని.. లావణ్య భయపెడుతూ ఇబ్బందులకు గురి చేస్తోందని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై మాదాపుర్‌ సీఐ కృష్ణమోహన్‌ మాట్లాడుతూ.. కాకతీయ హిల్స్‌లో నివాసం ఉంటున్న రాజ్‌ తరుణ్‌ తల్లిదండ్రులు బసవరాజు, రాజ్యలక్ష్మి రాత్రి 7:30 గంటల సమయంలో  స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేశారని తెలిపారు. నిన్న సాయంత్రం లావణ్య ఇంటికి వచ్చి తలుపులు బలంగా తట్టి, గట్టిగా కేకలు వేసి అల్లరి చేసిందని వారు ఫిర్యాదులో పేర్కొన్నారని చెప్పారు. ఈ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు వెల్లడించారు. తనను ప్రేమించి మోసం చేశాడంటూ లావణ్య రాజ్‌ తరుణ్‌పై కొన్ని రోజుల క్రితం నార్సింగి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.

Updated Date - Aug 02 , 2024 | 01:04 AM