పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ దూకుడు.. లైన్‌లో ప్ర‌భాస్‌, స‌న్నిడియోల్‌, ర‌వితేజ‌, శేష్‌, తేజ

ABN , Publish Date - Jul 30 , 2024 | 05:07 PM

ఇప్పుడు మ‌న‌కు త‌రుచూ వినిపిస్తున్న మాట‌, క‌నిపిస్తున్న పేరు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ. వ‌రుస‌గా భారీ బ‌డ్జెట్ చిత్రాల‌నే కాకుండా కంటెంట్ బేస్డ్ సినిమాల‌తో ప్ర‌త్యేక‌మైన పేరును సంపాదించుకుంటోంది. ప్ర‌స్తుతం ఓ డ‌జ‌న్ చిత్రాల వ‌ర‌కు ఏక కాలంలో నిర్మిస్తోంది.

peoples media

ఇప్పుడు మ‌న‌కు త‌రుచూ వినిపిస్తున్న మాట‌, క‌నిపిస్తున్న పేరు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ (People Media Factory). వ‌రుస‌గా భారీ బ‌డ్జెట్ చిత్రాల‌నే కాకుండా కంటెంట్ బేస్డ్ సినిమాల‌ను రూపొందిస్తూ ప్ర‌త్యేక‌మైన పేరును సంపాదించుకుంటోంది. ప్రొడ్యూసర్ TG విశ్వ ప్రసాద్ (Vishwa Prasad) తన టేస్ట్‌కు తగ్గట్టుగా అన్ని ఒక్క జాన‌ర్‌కే ప‌రిమితం కాకుండా వివిధ‌ రకాల జానర్లలో అద్భుతమైన ప్రాజెక్టులను నిర్మిస్తున్నారు. ఆకర్షణీయమైన కథనాలను రూపొందించడంలో, విభిన్న కథాకథనాలను అన్వేషించడంలో నిర్మాణ సంస్థ ఎప్పుడూ ముందుంటూ వ‌స్తోంది.

images.jpeg

తాజాగా మహారాజా రవితేజ (Raviteja), హరీష్ శంకర్ కాంబోలో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ (People Media Factory) నిర్మించిన మిస్టర్ బచ్చన్ (Mr Bachchan) ఆగస్ట్ 15న థియేట‌ర్ల‌లోకి రాబోతోంది. ఇటీవ‌ల విడుద‌లైన పాట‌లు, టీజర్ మంచి స్పంద‌న‌ను రాబట్టుకున్నాయి. సోష‌ల్ మీడియాలో ట్రెండ్ కూడా అయ్యాయి.

mrbachchanraviteja.jpg

అయితే ఇప్పుడు ఇదే నిర్మాణ సంస్థ నుంచి మరో భారీ చిత్రం రాజా సాబ్ (Rajasaab) రాబోతోంది. దర్శకుడు మారుతి ఇటీవలే ఈ సినిమా నుంచి గ్లింప్స్‌ రిలీజ్ చేసి ఒక్కసారిగా అంచనాలు పెంచేశారు. ఇందులో ప్రభాస్ ( Prabhas) అద్భుతమైన కొత్త లుక్‌లో కనిపించారు. గ్లింప్స్‌కి పాజిటివ్ రియాక్షన్ రావడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.

Prabhas.jpg


ఇదిలాఉండ‌గా.. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ (People Media Factory) టీజీ విశ్వ ప్రసాద్ ప్రస్తుతం తన ప్రొడక్షన్ సినిమాల‌ లైనప్‌ మ‌రింత ఇంట్రెస్టింగ్‌గా ఉంది. ఇప్ప‌టికే శ‌ర్వానంద్ (Sharwanand) తో చేసిన మ‌న‌మే (Manamey) చిత్రం విడుద‌లవ్వ‌గా ఇంకా స్టార్ హీరోలు, స్టార్ క్యాస్టింగ్‌తో అద్భుతమైన కంటెంట్-సెంట్రిక్ మూవీస్‌లను ప‌ట్టాలెక్కించింది.

sunny.jpg

అదేవిధంగా శ్రీను వైట్ల‌, గోపిచంద్ (Gopichand) కాంబినేష‌న్‌లో విశ్వం (Viswam) తేజ సజ్జతో మిరాయ్ (MIRAI), అడివి శేష్‌తో G2,శ్రీ విష్టుతో స్వాగ్ (SWAG) వంటి చిత్రాలను నిర్మిస్తున్నారు. అంతే కాకుండా, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఇటీవలే సన్నీ డియోల్, గోపీచంద్ మలినేనిల డైనమిక్ కాంబినేషన్‌తో కొత్త ప్రాజెక్ట్‌, బెంగాలీలో తీస్తున్న మా కాళి ను ప్రకటించింది.

Updated Date - Jul 30 , 2024 | 05:07 PM