Peka Medalu: పెయిడ్‌ ప్రీమియర్స్‌ 50 రూపాయలకే!

ABN , Publish Date - Jul 16 , 2024 | 03:12 PM

క్రేజీ యాంట్స్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై 'ఎవరికీ చెప్పొద్దు’ ఫేం రాకేష్‌ వర్రే నిర్మాతగా తెరకెక్కిన చిత్రం 'పేక మేడలు’.  గతంలో ‘నా పేరు శివ’, ‘అంధగారం’, ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ సినిమాల్లో నటించిన వినోద్‌ కిషన్‌ హీరోగా పరిచయమవుతున్నారు.

క్రేజీ యాంట్స్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై 'ఎవరికీ చెప్పొద్దు’ ఫేం రాకేష్‌ వర్రే (Rakesh Varre) నిర్మాతగా తెరకెక్కిన చిత్రం 'పేక మేడలు’ (Peka medalu).  గతంలో ‘నా పేరు శివ’, ‘అంధగారం’, ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ సినిమాల్లో నటించిన వినోద్‌ కిషన్‌ హీరోగా పరిచయమవుతున్నారు. అనూష కృష్ణ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఉమెన్‌ మహిళా సాధికారితపై సాగే చిత్రమిది. ఇటీవల ఈ చిత్రం ట్రైలర్‌ని విడుదల చేశారు.  "కామెడీతోపాటు మధ్యతరగతి కుటుంబాల మధ్య భావోద్వేగాలను దర్శకుడు చక్కగా చూపించారు. ఇంతకుముందు వినూత్న రీతిలో క్యూఆర్‌ స్కాన్‌తో, బంతితో హీరో చేసిన ప్రమోషన్స్‌ బాగా వర్క్‌ అవుట్‌ అయ్యాయి. ఇక ఇప్పుడు అదే తరహాలో ప్రమోషన్‌ చేస్తూ పెయిడ్‌ ప్రీమియర్స్‌ టికెట్‌ రేట్‌ 50 రూపాయలకే పెట్టి వైజాగ్‌, విజయవాడ, హైదరాబాద్‌లో పలు ప్రదేశాల్లో ప్రత్యేక షోలు ప్రదర్శించనున్నారు. ఈ తరహా ప్రమోషన్స్  ఆకట్టుకోవడంతో డిస్ట్రిబ్యూటర్స సినిమాను విడుదల చేయడానికి ముందుకొచ్చారని మేకర్స్‌ చెబుతున్నారు.

peka  (2).jpeg

ఈ సందర్భంగా దర్శకుడు నీలగిరి మామిళ్ల "ట్రైలర్‌కి చాలా మంచి స్పందన లభిస్తోంది. ప్రొడ్యూసర్‌ రాకేష్‌ వర్రే సపోర్ట్‌ మరువలేనిది. సినిమాల్లో నటించిన నటీనటులందరూ బాగా సహకరించారు. ప్రేక్షకులని కూడా మేము ఏ ప్రమోషన్స్‌ చేస్తున్నా ఆదరిస్తూ సపోర్ట్‌ చేస్తున్నారు. ఈనెల 19న సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాం. కంటెంట్‌ ఉన్న సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఎలా ఆదరిస్తున్నారో మా సినిమాను కూడా అలాగే ఆదరిస్తారని ఆశిస్తున్నాం. కచ్చితంగా మా చిత్రం ప్రేక్షకుల్ని అలరిస్తుంది’’ అని అన్నారు. 

peka  (1).jpeg

Updated Date - Jul 16 , 2024 | 03:13 PM