Prabhas - Nayanthara: ప్రభాస్ కోసం నయనతార..
ABN , Publish Date - Dec 06 , 2024 | 08:25 AM
డార్లింగ్ ప్రభాస్ (Prabhas) కథానాయకుడిగా మారుతి (Maruthi) దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'రాజాసాబ్’ (The Raja saab) పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్నారు.
డార్లింగ్ ప్రభాస్ (Prabhas) కథానాయకుడిగా మారుతి (Maruthi) దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'రాజాసాబ్’ (The Raja saab) పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్నారు. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ కథానాయికలు. ప్రస్తుతం చిత్రీకరణ చివరి దశలో ఉంది. తాజా షెడ్యూల్ హైదరాబాద్లో జరుగుతోంది. అయితే ఈ చిత్రంలో ఓ ప్రత్యేక గీతం ఉన్నట్లు కొంతకాలంగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ పాటలో ప్రభాస్తో కలిసి నయనతార (Nayanthara) ఆడిపాడనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ విషయమై ఆమెతో సంప్రదింపులు జరిపారని తెలిసింది. ఈ నెలాఖరులో లేదా వచ్చే నెలలో పాటను చిత్రీకరించే అవకాశముంది.
ప్రభాస్, నయన్ 2007లో వచ్చిన 'యోగి' చిత్రంలో జంటగా నటించారు. అంతా ఓకే అయితే మళ్లీ 17 ఏళ్ల తర్వాత వీరిద్దరూ కలిసి స్క్రీన్ మీద కనిపించనున్నట్లు అవుతుంది. హారర్ ఎంటర్టైనర్గా సిద్ధమవుతున్న ఈ చిత్రంలో ప్రభాస్ రెండు భిన్న కోణాల్లో కనిపించనున్నారు. ఇందులో ఫస్ట్ సాంగ్ను సంక్రాంతి సందర్భంగా విడుదల కానుంది. సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.