AP -TS floods: మైతీ నిర్మాతలు.. సురేష్‌ ప్రొడక్షన్స్‌ విరాళం ఎంతంటే

ABN , Publish Date - Sep 06 , 2024 | 07:55 PM

తెలుగు రాష్ట్రాల్లోని వరద బాధితుల సహాయార్థం ప్రభుత్వాల పిలుపు మేరకు నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ (mythri movie makers) రూ.50లక్షల విరాళాన్ని ప్రకటించింది


తెలుగు రాష్ట్రాల్లోని వరద బాధితుల సహాయార్థం ప్రభుత్వాల పిలుపు మేరకు నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ (mythri movie makers) రూ.50లక్షల విరాళాన్ని ప్రకటించింది. ‘‘గడిచిన వారం రోజులు నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, వరదలు కారణంగా తెలుగు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీగా ఆస్తి నష్టం కూడా జరిగింది. ఈ ఆపద సమయంలో ప్రభుత్వాలు చేపట్టిన సహాయక చర్యలకు మా వంతు సాయంగా ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ ముఖ్యమంత్రుల సహాయ నిధికి రూ.50 లక్షలు  విరాళంగా ఇస్తున్నాం. ఈ ప్రతికూల పరిస్థితుల నుంచి రెండు రాష్ట్రాల ప్రజలు త్వరగా కోలుకోవాలి. బాధిత కుటుంబాలకు సాధారణ స్థితికి రావాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాం’’ అంటూ నిర్మాతలు నవీన్‌ యెర్నేని, రవిశంకర్‌ యలమంచిలి పేర్కొన్నారు. అలాగే సురేశ్‌ ప్రొడక్షన్స్‌ నుంచి హీరో వెంకటేష్‌, రానా దగ్గుబాటి రూ. కోటి విరాళంగా ప్రకటించారు.
తెలుగు రాష్ట్రాల ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారని టాలీవుడ్‌ నుంచి ఇప్పటికే హీరోలు, దర్శకనిర్మాతలు విరాళాలు ప్రకటించారు. ప్రభాస్‌ రూ.2 కోట్లు, అగ్రతారలైన చిరంజీవి, బాలకృష్ట, ఎన్టీఆర్‌, మహేశ్‌ బాబు, అల్లు అర్జున్‌, రామ్‌ చరణ్‌ రూ.కోటి చొప్పున విరాళం అందించారు. 

Updated Date - Sep 06 , 2024 | 07:55 PM