Mohan Babu: మోహన్ బాబు డిశ్చార్జ్.. డాక్టర్లు ఏం చెప్పారంటే
ABN , Publish Date - Dec 12 , 2024 | 04:11 PM
రెండు రోజుల క్రితం నటుడు మోహన్ బాబు ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే..
మంచు మోహన్బాబు కుటుంబంలో గత నాలుగు రోజులుగా ఇంటి గొడవలు ఎలా రచ్చకెక్కాయో తెలిసిందే. అయితే మంగళవారం రాత్రి జరిగిన ఘర్షణలో మోహన్ బాబు తలకు గాయం కావడంతో ఆయనని మంచు విష్ణు హాస్పిటల్లో జాయిన్ చేశారు. మోహన్బాబు గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న విషయం తెలిసిందే.
రెండు రోజుల చికిత్స తర్వాత డాక్టర్లు మోహన్ బాబుని డిశ్చార్జ్ చేశారు. బుధవారం రిలీజ్ చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం.. మోహన్ బాబు హాస్పిటల్కి వచ్చినప్పుడు ఒళ్ళు నొప్పులు ఉన్నాయి. బీపీ పెరిగింది. అతనికి ప్రస్తుతం మెడలో నొప్పి విపరీతంగా ఉంది. మానసికంగా బాగా కృంగిపోయి ఉన్నారు. ఎక్కువ యాంగ్జైటీగా ఉన్నారు. ఫేస్ మీద కొన్ని గాయాలు ఉన్నాయి. బీపీ 200 పైన ఉంది.. హార్ట్ సైడ్ అంతా బాగానే ఉంది. రాత్రంతా బాధ వల్ల నిద్ర లేదు. గతంలో జరిగిన కొన్ని సర్జరీలతో ఆయన వేరే మెడిసిన్ వాడుతున్నారని కాంటినెంటల్ హాస్పిటల్ ఛైర్మెన్ గురు ఎన్ రెడ్డి తెలిపారు. ఇంటర్నల్ గాయాలు ఉన్నాయి. సీటీ స్కాన్ తీశాము. డిశ్చార్జ్కి ఇంకా రెండ్రోజులు పట్టే అవకాశం ఉంది. ఆయన మానసికంగా కోలుకోవడానికి సమయం పడుతుంది.. అని కాంటినెంటల్ హాస్పిటల్ వైద్యులు తెలిపారు
మరోవైపు తెలంగాణ హైకోర్టు మోహన్బాబుకు బిగ్ రిలీఫ్ ఇచ్చింది. తనపై నమోదైన కేసులకు సంబంధించి విచారణకు హాజరుకావాలని పోలీసులు మోహన్బాబుకు నోటీసులు జారీచేశారు. పోలీసుల నోటీసులపై మోహన్బాబు తనకు విచారణ నుంచి మినహాయింపు ఇవ్వాలని తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. కోర్టులో లంచ్మోషన్ పిటిషన్ వేయగా.. విచారణ జరిపిన జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి ధర్మాసనం పోలీసుల ముందు విచారణ నుంచి మినహాయింపు ఇచ్చింది. తదుపరి విచారణను ఈనెల 24వ తేదీకి వాయిదా వేసింది