Chiranjeevi: ఊటీలో విలువైన ప్రాప‌ర్టీ కొన్న చిరంజీవి! ఎన్ని కోట్లంటే

ABN , Publish Date - Oct 08 , 2024 | 06:56 AM

సోష‌ల్ మీడియాలో ఓ ఆస‌క్తిక‌ర‌మైన వార్త రెండు రోజులుగా చ‌క్క‌ర్లు కొడుతోంది. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఊటీలో ఓ కొండ ప్రాంతంలో ఓ ప్రాప‌ర్టీ కొనుగోలు చేసినట్లు స‌మాచారం.

chiranjeevi

సోష‌ల్ మీడియాలో ఓ ఆస‌క్తిక‌ర‌మైన వార్త రెండు రోజులుగా చ‌క్క‌ర్లు కొడుతోంది. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ఊటీలో ఓ కొండ ప్రాంతంలో ఓ ప్రాప‌ర్టీ కొనుగోలు చేసినట్లు స‌మాచారం. దేశ వ్యాప్తంగా ఉన్న చాలామంది సెల‌బ్రిటీలు త‌మ‌సెల‌వుల‌ను గ‌డ‌ప‌డానికి ఊటీలో బంగ్లాలు కొన‌డం, కొత్త‌వి నిర్మించుకోవ‌డం చేస్తూ ఉన్నారు. ఈ క్ర‌మంలో ఇప్ప‌టికే త‌మిళనాట అనేక మంది సినిమా తార‌ల‌కు అక్క‌డ సొంత ఫామ్ హౌజ్‌లు ఉండ‌గా ఇటీవ‌ల క‌న్న‌డ‌, బాలీవుడ్‌తో పాటు మ‌న తెలుగు సినీ ప్ర‌ముఖులు ఊటీలో విలాస‌వంత‌మైన స్థ‌లాలు, బంగ్లాలు కొనుగోలు చేస్తున్నారు. తాజాగా ఆ లిస్టులో మ‌న మెగాస్టార్ చిరంజీవి చేరి పోయారు.

ooty.webp

వివ‌రాల్లోకి వెళితే ఇప్ప‌టికే హైద‌రాబాద్‌, గోవా, విశాఖ ప‌ట్నం, చెన్నై వంటి ప్ర‌ధాన న‌గ‌రాల‌లో సొంత ఇండ్లు ఉన్న చిరంజీవి తాజాగా త‌మిళ‌నాడులోని ఊటీ అవుట్ స్కర్ట్స్ లో ఓ స్థ‌లాన్ని కొనుగోలు చేశారు. చుట్టూ టీ గార్డెన్స్ మ‌ధ్య మంచి వ్యూ పాయింట్‌లో 5.5 ఎక‌రాల విస్తీర్ణంలో ఉన్న ప్రాప‌ర్టీని ఇటీవ‌లే చిరంజీవి స్వ‌యంగా చూసి వెంట‌నే కొనుగోలు చేశార‌ని దాని విలువ సుమారు రూ.16 కోట్లకు పైనే ఉంటుంద‌ని వినిపిస్తోంది. దానికి సంబంధించి రిజిస్టేష‌న్ వ్య‌వ‌హ‌రాలు కూడా పూర్త‌య్యాయ‌ని స‌మాచారం. ఇప్ప‌టికే ఈ స్థ‌లాన్ని రామ్ చ‌ర‌ణ్ ఉపాస‌న దంప‌తులు వెళ్లి చూసి వ‌చ్చార‌ని, త్వ‌ర‌లోనే అనుభ‌వం క‌లిగిన ఆర్కిటెక్స్ట్ ఆధ్వ‌ర్యంలో ఓ ఫామ్ హౌజ్ నిర్మించ‌డానికి ఫ్లాన్ చేస్తున్నార‌ని, ప్ర‌స్తుతం అనుమ‌తుల కోసం వేచి చూస్తున్నార‌ని అంటున్నారు.


ఇదిలాఉండ‌గా చిరంజీవికి ఇప్ప‌టికే క‌ర్ణాట‌క బెంగ‌ళూరు కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలోని దేవనహళ్లిలో ఇప్పటికే ఓ విలాస‌వంత‌మైన‌ ఫామ్‌హౌస్ ఉంది. తరచుగా చిరంజీవి పండుగ స‌మ‌యాల్లో త‌న కుటుంబంతో అక్క‌డ గడుపుతూ వ‌స్తున్నారు. అందుకు సంబంధించిన ఫొటోలు సైతం గ‌తంలో మ‌నం అనేక సార్లు చూసిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం చిరంజీవి నివ‌సిస్తున్న జూబ్లీహిల్స్‌ లోని బంగ్లా కూడా చాలా విలువైన ప్రాంతంలో చాలా విశాలంగా ఉండ‌డ‌మే కాక అందులో అవుట్‌డోర్ పూల్, టెన్నిస్ కోర్ట్, ఫిష్‌పాండ్ అండ్ గార్డెన్ స్పేస్ వంటివి ఉన్నాయని ఇప్ప‌టికీ నెట్టింట వార్త‌లు హ‌ల్చ‌ల్ చేస్తుంటాయి.

ooty1.webp

ఇక ఆచార్య‌, బోళా శంక‌ర్ వంటి డిజాస్ట‌ర్ చిత్రాల త‌ర్వాత బింబిసార మూవీ ద‌ర్శ‌కుడు వ‌శిష్ట ద‌ర్శ‌క‌త్వంలో చిరంజీవి న‌టిస్తున్న విశ్వంభ‌ర సినిమా ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. త్రిష ఈ సినిమాలో క‌థా నాయుకగా న‌టిస్తోండ‌గా అషిక రంగ‌నాథ్‌, మీఆక్షి చౌద‌రి, ర‌మ్య ప‌సుపులేటి, బాలీవుడ్ న‌టుడు కునాల్ క‌పూర్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఆస్కార్ గ్ర‌హీత కీర‌వాణి సంగీతం అందిస్తుండ‌గా 2025 జ‌న‌వ‌రిలో సంక్రాంతి పండుగ‌కు ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

Updated Date - Oct 08 , 2024 | 06:56 AM