Venu Swami: వేణు స్వామికి మంచు విష్ణు ఫోన్.. ఏం జరిగిందంటే!

ABN , Publish Date - Aug 12 , 2024 | 05:08 PM

రాజకీయ విశ్లేషణలు, సినీ సెలబ్రిటీల జోత్యిష్యం జోలికి రానని ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి (Venu Swami) మరోసారి చెప్పారు.

రాజకీయ విశ్లేషణలు, సినీ సెలబ్రిటీల జోత్యిష్యం జోలికి రానని ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి (Venu Swami) మరోసారి చెప్పారు. ఇటీవల నిశ్చితార్థం చేసుకున్న అక్కినేని నాగచైతన్య (Naga chaitanya) శోభిత ధూళిపాళ్ల (Sobhita Dhulipalla) పెళ్లయిన కొన్నాళ్లకు విడిపోతారని ఇద్దరి గ్రహ మైత్రి సరిలేదని, నిశ్చితార్థం జరిగిన సమయం కూడా అనుకూలంగా లేదని, ఈ కారణాలతో వారు విడిపోతారని జోస్యం చెప్పారు. సమంతతో విడిపోయినట్లే, శోభితతో కూడా చైతన్య విడిపోతాడని ఆయన సెలవవ్వడంతో అభిమానులు, నెటిజన్లు వేణుస్వామిని ట్రోల్‌ చేశారు. సోషల్‌ మీడియా వేదికగా మాట యుద్దాలు చేశారు. ఇదే విషయంపై మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన అధ్యక్షుడు మంచు విష్ణు (Manchu Vishnu) కూడా వేణుతో ఫోనులో మాట్లాడటంతో ఆయన ఓ వీడియో రిలీజ్‌ చేశారు.

"రెండు నెలల క్రితమే రాజకీయ విశ్లేషణలు, సినీ సెలబ్రిటీల జాతాకలు చెప్పనని చెప్పాను. దానికి నేను కట్టుబడి ఉంటాను. అయితే నాగచైతన్య, శోభిత జాతకం గురించి చెప్పడానికి కారణం ఉంది. గతంలో సమంత, చైతన్య గురించి చెప్పాను, దానికి కొనసాగింపు అన్నట్లు ఇది చెప్పాను. ఇదే విషయంపై మంచు విష్ణు ఫోన్లో మాట్లాడారు. ఇకపై సెలబ్రిటీల జ్యోతిష్యాలు చెప్పనని, సంబంధిత వీడియోలో పోస్ట్‌ చేయనని చెప్పాను. ఆయన కూడా పాజిటవ్‌గా తీసుకున్నారు. ఇకపై నా నుంచి సెలబ్రిటీల జ్యోతిష్యాలు ఆశించవద్దు’ అని వీడియోలో పేర్కొన్నారు. 

Updated Date - Aug 12 , 2024 | 05:08 PM