Vijay Kanakamedala: మనోజ్, రోహిత్, శ్రీనివాస్ ఓ  మల్టీస్టారర్‌

ABN , Publish Date - Aug 03 , 2024 | 05:33 PM

బెల్లంకొండ శ్రీనివాస్‌(Bellamkonda srinivas), నారా రోహిత్‌(nara rohith), మంచు మనోజ్‌ (Manchu manoj) కాంబోతో ఓ సినిమా రాబోతోంది. ‘నాంది’ దర్శకుడు విజయ్‌ కనకమేడల (Vijay kanakamedala) ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు

బెల్లంకొండ శ్రీనివాస్‌(Bellamkonda srinivas), నారా రోహిత్‌(nara rohith), మంచు మనోజ్‌ (Manchu manoj) కాంబోతో ఓ సినిమా రాబోతోంది. ‘నాంది’ దర్శకుడు విజయ్‌ కనకమేడల (Vijay kanakamedala) ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ నెలలోనే ఈ చిత్రానికి శ్రీకారం చుడతారు. అయితే ఇదో రీమేక్‌ కథ అని తెలుస్తోంది. తమిళంలో మంచి విజయాన్ని అందుకొన్న ‘గరుడన్‌’ సినిమాని తెలుగులో రీమేక్‌ చేయబోతున్నారని టాక్‌. టైటిల్‌ కూడా ‘గరుడ’గా ఫిక్స్‌ చేశార్ట. దొరై సెంథిల్‌ కుమార్‌ దర్శకత్వంలో రూపొందించిన కథ ‘గరుడన్‌’. ఈ చిత్రానికి వెట్రిమారన్‌ కథ అందించడమే కాకుండా, నిర్మాతగానూ వ్యవహరించారు. ముగ్గురు స్నేహితుల కథ ‘గరుడన్‌’. ఇందులో ప్రతీకారం అనే పాయింట్‌ కూడా ఉంది. ఎవరు ఎవరిపై ఎందుకు ప్రతీకారం తీర్చుకొన్నారన్నదే ఆసక్తికరం. తమిళంలో సూరి, ఉన్నిముకుందన్‌, శశికుమార్‌ నటించారు. తెలుగులో ఈ పాత్రల్లో బెల్లంకొండ శ్రీను, నారా రోహిత్‌, మనోజ్‌ నటిస్తారు. మనోజ్‌ క్యారెక్టర్‌లో నెగిటివ్‌ షేడ్‌ ఉంటుందని సమాచారం. తమిళంలో ‘రా అండ్‌ రస్టిక్‌గా ఉండే సినిమా ఇది. కానీ తెలుగు ప్రేక్షకుల కోసం కొన్ని మార్పులు చేశారు. త్వరలోనే టైటిల్‌తోపాటు ఇతర వివరాలు వెల్లడిస్తారు. 

Updated Date - Aug 03 , 2024 | 06:43 PM