Mahesh Babu: లండన్ లో గౌతమ్‌ మొదటి ప్రదర్శన!

ABN , Publish Date - Jun 23 , 2024 | 12:22 PM

మహేష్  దంపతులు క్లౌడ్ నైన్ లో ఉన్నారు. వారి ఆనందానికి హద్దు లేదు. తన కుమారుడు గౌతమ్‌ను చూసి ఎంతో గర్విస్తున్నారు.

Mahesh Babu: లండన్ లో గౌతమ్‌ మొదటి ప్రదర్శన!

మహేష్ (Mahesh) దంపతులు క్లౌడ్ నైన్ లో ఉన్నారు. వారి ఆనందానికి హద్దు లేదు. తన కుమారుడు గౌతమ్‌ను (Goutham) చూసి ఎంతో గర్విస్తున్నారు. మహేష్‌-నమ్రత(Namratha) దంపతుల కుమారుడు గౌతమ్‌ లండన్‌లో తొలి ప్రదర్శన ఇచ్చిన ప్రేక్షకులు మన్ననలు అందుకున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. ‘‘గౌతమ్‌ ఫస్ట్‌ థియేటర్‌ స్టేజ్‌ పెర్ఫామెన్స్‌ అద్భుతంగా ఉంది. చూసిన వారంతా ఎంజాయ్‌ చేశారు. చిన్నారుల్లోని ప్రతిభను వెలికితీేసందుకు ‘జాయ్‌ ఆఫ్‌ డ్రామా’ నిర్వహించే సమ్మర్‌ ప్రోగ్రామ్‌ ఎంతగానో ఉపయోగపడుతుంది. స్నేహితులు, కుటుంబంతో కలిసి ఇక్కడకు రావడం సంతోషంగా ఉంది’’ అని పేర్కొన్నారు.

మహేశ్‌ బాబు, సితార(Sitara), నమ్రతా సోదరి శిల్పా శిరోద్కర్‌ తదితరులు హాజరయ్యారు. సంబంధిత ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. గౌతమ్‌ ఇటీవల గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే బాల నటుడిగా తెరంగేట్రం చేశాడు. మహేశ్‌ హీరోగా తెరకెక్కిన ‘1 నేన్కొక్కడినే’లో కనిపించి అలరించాడు.

Updated Date - Jun 23 , 2024 | 12:46 PM