SSMB29: న్యూలుక్‌లో మహేష్.. ఫొటోలు వైరల్‌

ABN , Publish Date - Aug 11 , 2024 | 04:47 PM

ఆగస్ట్‌ 9న సూపర్‌స్టార్‌ మహేష్‌ బాబు (Maheshbabu) పుట్టినరోజు సందర్భంగా కుటుంబంతో కలిసి రాజస్థాన్లోని  జైపుర్‌కు వెళ్లిన విషయం తెలిసిందే. అక్కడ సెలబ్రేషన్స్‌, విహారం పూర్తయిన అనంతరం  ఆయన హైదరాబాద్‌కు తిరిగి పయనమయ్యారు.

ఆగస్ట్‌ 9న సూపర్‌స్టార్‌ మహేష్‌ బాబు (Maheshbabu) పుట్టినరోజు సందర్భంగా కుటుంబంతో కలిసి రాజస్థాన్లోని  జైపుర్‌కు వెళ్లిన విషయం తెలిసిందే. అక్కడ సెలబ్రేషన్స్‌, విహారం పూర్తయిన అనంతరం  ఆయన హైదరాబాద్‌కు తిరిగి పయనమయ్యారు. జైపుర్‌ ఎయిర్‌పోర్ట్‌లో కుటుంబసభ్యులతో కెమెరాకు చిక్కారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. మహేష్‌ న్యూ లుక్‌లో (Mahesh new look) దర్శనమిచ్చారు. పోనీ టెయిల్‌, గుబురు గడ్డంతో సినీ ప్రియులను అబ్బురపరిచారు. దీనిని చూసిన నెటిజన్లు.. రాజమౌళి ప్రాజెక్ట్‌ కోసమే ఈ లుక్‌లో ఉన్నారని, మరికొందరైతే  ‘వావ్‌’ అని కామెంట్స్‌ చేస్తున్నారు.

రాజమౌళి (Rajamouli)దర్శకత్వంలో 'ఎస్‌ఎస్‌ఎంబీ 29' (SSMB29) వర్కింగ్‌ టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని దుర్గా ఆర్ట్స్‌ పతాకంపై కె.ఎల్‌ నారాయణ భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో దేశంలోని అగ్ర నటులతోపాటు హాలీవుడ్‌ ప్రముఖులు కూడా నటిస్తారని తెలుస్తోంది. భారతీయ చిత్ర పరిశ్రమలో ఇప్పటి వరకూ చూడని సరికొత్త ప్రపంచాన్ని రాజమౌళి ఆవిష్కరించబోతున్నారని రచయిత విజయేంద్రప్రసాద్‌ గతంలో ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. అమెజాన్‌ అడవుల నేపథ్యంలో సాగే చిత్రమిది. అయితే ఇందులో పాత్ర కోసం మహేశ్  మేకోవర్‌ మొత్తం మారుస్తున్నారు. ఇప్పటికే వర్కవుట్స్‌ పాత్రకు సంబంధించిన విద్యలను మహేశ్ విదేశాల్లో నేర్చుకున్నారు.

 

Updated Date - Aug 11 , 2024 | 04:47 PM