Keerthy Suresh: సినిమాల వరకూ విమర్శలను పట్టించుకుంటా!

ABN , Publish Date - Jul 26 , 2024 | 05:07 PM

కీర్తి సురేశ్‌ (keerthy suresh) ప్రధాన పాత్ర నటించిన చిత్రం ‘రఘు తాత’ (Raghu Thatha). ఆగస్టు 15న ఇది ప్రేక్షకుల ముందుకురానుంది. ప్రస్తుతం ఆమె ప్రమోషన్సలో బిజీగా ఉంది. తాజాగా అభిమానులతో ముచ్చటించారు.

కీర్తి సురేశ్‌ (keerthy suresh) ప్రధాన పాత్ర నటించిన చిత్రం ‘రఘు తాత’ (Raghu Thatha). ఆగస్టు 15న ఇది ప్రేక్షకుల ముందుకురానుంది. ప్రస్తుతం ఆమె ప్రమోషన్సలో బిజీగా ఉంది. తాజాగా అభిమానులతో ముచ్చటించారు. అంతే కాదు తన పెళ్లి గురించి వస్తున్న కథనాలపై ఆమె స్పందించారు. తన చిరకాల మిత్రుడిని కీర్తి పెళ్లాడబోతుందని వార్తలు కొద్దిరోజులుగా వైరల్‌ అవుతున్న తరుణంలో ఆమె స్పందించారు. (marriage rumours)

‘‘ఏదైనా రూమర్‌ గురించి మనం వివరణ ఇస్తే అది నిజమేనని అందరూ భావిస్తాను. అందుకే అలాంటివాటిపై నేను స్పందించను. నా నటన లేదా సినిమాల ఎంపిక గురించి ఎవరైనా వివరణాత్మక విమర్శలు చేేస్త తప్పకుండా వాటిని స్వీకరిస్తాను. అలాంటి వాటినుంచి కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఇష్టపడతాను. నా వ్యక్తిగత జీవితం, కుటుంబం గురించి ఎవరైనా కామెంట్స్‌ చేస్తే వాటిని పరిగణలోకి తీసుకోను. వివిధ కారణాల వల్ల వాళ్లు చేచేసే కామెంట్స్‌ను సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదు. కోలీవుడ్‌ ఇండస్ర్టీకి చెందిన మ్యూజిక్‌ డైరెక్టర్‌ను నేను పెళ్లాడనున్నానని వార్తలు వచ్చాయి. ఆ కథనాల్లో నిజం లేదు.. దీనిపై ఇప్పటికే నా తల్లిదండ్రులు క్లారిటీ ఇచ్చారు’’ అని కీర్తి సురేష్‌ అన్నారు.
తాజాగా ఆమె నటించిన ‘రఘు తాత’ చిత్రానికి సుమన్‌ కుమార్‌ దర్శకత్వం వహించారు. ప్రముఖ నిర్మాణసంస్థ హోంబలే ఫిల్మ్స్‌ నిర్మిస్తున్న తొలి తమిళ చిత్రమిది. దృఢ సంకల్పం ఉన్న ఓ మహిళ చేేస స్ఫూర్తిదాయకమైన పోరాట కథను ఇందులో చూపించనున్నారు. ఇటీవల ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. 

Updated Date - Jul 26 , 2024 | 05:07 PM