Film Celebs: పోలింగ్‌ బూతుల్లో తారల సందడి!

ABN , Publish Date - May 13 , 2024 | 12:23 PM

తెలంగాణలోని లోక్‌సభ (TS elections 2024) ఎన్నికల నేపథ్యంలో పోలింగ్‌ కేంద్రాల్లో  సినీతారలు (Film Celebs) సందడి చేశారు. తమ బాధ్యతగా భావించి ఉదయాన్నే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

Film Celebs: పోలింగ్‌ బూతుల్లో తారల సందడి!

తెలంగాణలోని లోక్‌సభ (TS elections 2024) ఎన్నికల నేపథ్యంలో పోలింగ్‌ కేంద్రాల్లో  సినీతారలు (Film Celebs) సందడి చేశారు. తమ బాధ్యతగా భావించి ఉదయాన్నే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi), భార్య సురేఖతో కలిసి జూబ్లీహిల్స్‌ క్లబ్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. దర్శకధీరుడు రాజమౌళి (SS Rajamouli), తన భార్యతో కలిసి దుబాయ్‌ నుంచి నేటి ఉదయాన్నే ఫ్లైట్‌ దిగి నేరుగా పోలింగ్‌ బూతకు చేరుకుని ఓటు వేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. 'జర్నీలో అలసిపోయాం. అయినా నేరుగా పోలింగ్‌ బూత్ కు  వచ్చి ఓటు వేశాం' అని పేర్కొన్నారు. ఓటు మనకున్న హక్కు అని ఆయన అన్నారు. ఓటు అనే ఆయుధంతో సరైన నాయకుడిని ఎన్నుకోవాలని సినీ తారలు పిలుపునిచ్చారు.


జూ.ఎన్టీఆర్‌(NTR), అల్లు అర్జున్(Allu arjun), అల్లు అరవింద్‌, మంచు మోహను బాబు, విష్ణు, మనోజ్‌, శ్రీకాంత్, కోట శ్రీనివాసరావు, తనికెళ్ల భరణి, నాగచైతన్య, బుచ్చిబాబు, శ్రీనివాసరెడ్డి, వందేమాతరం శ్రీనివాస్‌, శేఖర్‌ కమ్ముల, దర్శకుడు బాబీ, బెనర్జీ తదితరులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే పవన్ కళ్యాణ్  పిఠాపురంలో భారీ మెజారిటీతో గెలుపొందాలని గబ్బర్‌సింగ్‌ అంత్యక్షరీ బ్యాచ్  ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

Updated Date - May 13 , 2024 | 12:23 PM